News March 7, 2025
వీరఘట్టం: హార్ట్ ఎటాక్తో మహిళ మృతి

వీరఘట్టం మేజరుపంచాయతీలోని ముచ్చర్లవీధికి చెందిన డాకూ సునీత (47 ) అనే మహిళ శుక్రవారం తెల్లవారుజామున హార్ట్ ఎటాక్తో మృతి చెందారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో సునీతకు గుండెనొప్పి రావడంతో వీరఘట్టం పీ.హెచ్.సీకి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. తర్వాత పార్వతీపురం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Similar News
News October 14, 2025
పెద్దపల్లి ఉపాధ్యాయుడికి వరల్డ్ రికార్డ్స్లో చోటు

PDPL(D) ఓదెల(M) మడక గ్రామానికి చెందిన చిత్రకళ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్కు క్రెడెన్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని పెన్సిల్ గ్రఫైట్పై 0.4 MM ఎత్తు, 0.2 MM వెడల్పుతో ప్రపంచంలోనే అతిచిన్న జాతీయ పతాకాన్ని గంటపాటు శ్రమించి తయారు చేసినందుకుగాను రజనీకాంత్ ముంబైలో ఈ అవార్డు అందుకున్నారు. కాగా, ఈయన గతంలో అంతర్జాతీయ, జాతీయ అవార్డులనూ సాధించారు.
News October 14, 2025
శావల్యాపురం: మహిళ మాటలు నమ్మి మునిగాడు..!

మూడు నెలల్లో అమౌంట్ డబుల్ అవుతుందని ఓ మహిళ చెప్పడంతో నమ్మి శావల్యాపురం(M) మతకపల్లికి చెందిన సంపంగిరావు మోసపోయినట్లు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. బాధితుని కథనం.. ‘ఆన్లైన్లో పరిచయమైన మహిళ రైస్ బిజినెస్లో పెట్టుబడి పెడితే మూడు నెలల్లో డబుల్ అవుతుందని చెప్పింది. దాని కోసం రూ.7 లక్షలు తనకు పంపాను. తీసుకుని ఆమె మోసం చేసింది’ అని తెలిపాడు. తనకు న్యాయం చేయాలని పీజీఆర్ఎస్లో కంప్లైంట్ ఇచ్చాడు.
News October 14, 2025
గట్టు: ఈరోజే చివరి రోజు.. దరఖాస్తు చేసుకోండి

గట్టు మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్ పోస్టుకు గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతిలో బోధన చేయుటకు దరఖాస్తులను తీసుకుంటున్నామని పాఠశాల ఎస్ఓ గోపీలత తెలిపారు. బీఈడీలో ఇంగ్లిష్ చదివి ఉండాలని, టెట్ కూడా అర్హత కలిగి ఉండాలని తెలిపారు. ఈ ఉపాధ్యాయ గెస్ట్ ఫ్యాకల్టీ పోస్ట్కు దరఖాస్తు చేసుకోవడానికి ఈ రోజే చివరి అవకాశమని తెలిపారు. పూర్తి వివరాలకు కేజీబీవీ గట్టు పాఠశాలలో సంప్రదించాలని కోరారు.