News January 12, 2025
వీరన్న జాతరలో కొత్తపల్లి రథాలు స్పెషల్

కొత్తకొండ జాతర బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా ఉత్సవాలలో భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి ఎడ్లబండ్ల రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సంక్రాంతి రోజు ఆలయం చుట్టూ ఎడ్లబండ్లతో ప్రదక్షిణలు చేసి, భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని దర్శించుకుంటారు. 57 ఏళ్ల సంప్రదాయం ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అందంగా అలంకరించిన 70 ఎడ్లబండ్ల రథాలు జాతరకు కదులుతాయి. దారివెంట రథాలు తిలకించేందుకు జనం ఆసక్తిగా చూస్తారు.
Similar News
News February 18, 2025
కరీంనగర్: జీవం తీస్తున్న ఆన్లైన్ జూదం..!

ఇద్దరు యువకులు ఆన్లైన్ మోసాలకు బలైన ఘటన శంకరపట్నం మండలంలో జరిగింది. గద్దపాకకి చెందిన భూస కార్తిక్(25) ఆన్లైన్ రమ్మీ ఆడి రూ.15లక్షలు మోసపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పలపల్లికి చెందిన ఎడిగమధు(35) అనే యువ రైతు ఆన్లైన్ జూదంలో రూ. 10 లక్షలు మోసపోయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగుల పట్ల జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.
News February 18, 2025
కరీంనగర్: వ్యక్తిపై కొడవలితో దాడి.. తీవ్ర గాయాలు

హత్యాయత్నం చేసిన దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. మానకొండూరు మండలం ముంజంపల్లికి చెందిన బత్తిని సాగర్ పై అదే గ్రామానికి చెందిన రవి అనే వ్యక్తి భూసంబంధిత విషయంలో కొడవలితో దాడి చేయగా సాగర్కు తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 18, 2025
కరీంనగర్: కాలువలో దూకి యువతి ఆత్మహత్యాయత్నం

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కాకతీయ కెనాల్ కాలువలోకి దూకి సోమవారం ఓ యువతి ఆత్మహత్యకు యత్నించిందని స్థానికులు తెలిపారు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి కాలువలో దూకి ఆ యువతిని కాపాడామన్నారు. ఆత్మహత్య యత్నించిన ఆమె కరీంనగర్లోని శ్రీనగర్ కాలనీకి చెందిన యువతికి గుర్తించామని తెలిపారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి తీసుకెళ్లారన్నారు.