News June 27, 2024

వీరబల్లి: విషం పెట్టి వృద్ధ దంపతులను చంపేశారు

image

వీరబల్లి మండల కొత్తవడ్డెపల్లిలో ఇంట్లో ఉండొద్దని కోడలు అత్తమామలకు విషం పెట్టి చంపిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు మేరకు.. కొడుకు, కోడలు కలిసి సుబ్బన్న(80), నాగమ్మ(70) చంపేందుకు అన్నంలో విషం కలిపారు. అది తిన్న దంపతులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దంపతులు మరణించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News November 15, 2025

పంటల రక్షణకు IOT సాంకేతికత అవసరం: కలెక్టర్

image

కడప కలెక్టరేట్‌లో మైక్రో ఇరిగేషన్, ఉద్యాన పంటల సస్యరక్షణపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమీక్ష నిర్వహించారు. వాతావరణ మార్పుల పర్యవేక్షణకు నూతన సాంకేతిక పరిజ్ఞానం మేళవింపు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. క్రాపిన్, ఫసల్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ఐఓటీ ఆధారిత స్మార్ట్ వ్యవసాయ పరికరాల ప్రయోజనాలను తెలుసుకున్నారు. ఈ టెక్నాలజీ నీటి సమర్థతను, దిగుబడిని పెంచి, వ్యాధుల ముందస్తు హెచ్చరికలు ఇస్తుందన్నారు.

News November 14, 2025

పంటల రక్షణకు IOT సాంకేతికత అవసరం: కలెక్టర్

image

కడప కలెక్టరేట్‌లో మైక్రో ఇరిగేషన్, ఉద్యాన పంటల సస్యరక్షణపై జిల్లా కలెక్టర్ శ్రీధర్ సమీక్ష నిర్వహించారు. వాతావరణ మార్పుల పర్యవేక్షణకు నూతన సాంకేతిక పరిజ్ఞానం మేళవింపు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. క్రాపిన్, ఫసల్ సంస్థల ప్రతినిధులతో మాట్లాడారు. ఐఓటీ ఆధారిత స్మార్ట్ వ్యవసాయ పరికరాల ప్రయోజనాలను తెలుసుకున్నారు. ఈ టెక్నాలజీ నీటి సమర్థతను, దిగుబడిని పెంచి, వ్యాధుల ముందస్తు హెచ్చరికలు ఇస్తుందన్నారు.

News November 14, 2025

ప్రొద్దుటూరులో ఎగ్జిబిషన్ GST రూ.15.25 లక్షలు మాయం..!

image

ప్రొద్దుటూరు ఎగ్జిబిషన్ GSTకి సంబంధించిన భారీ నగదు లెక్కల్లో కనిపించడం లేదు. ఈ విషయాన్ని జీఎస్టీ అధికారులు గురువారం గుర్తించారు. 2021లో ఎగ్జిబిషన్‌కు సంబంధించి జీఎస్టీ రూ.15.25 లక్షలుగా నిర్ధారించారు. ఈ సొమ్మును చెల్లించామని మున్సిపల్ అధికారులు చెప్పగా.. ఆ డబ్బులు తమకు జమ కాలేదని GST అధికారులు అంటున్నారు. అసలు గుట్టు తేల్చడానికి జీఎస్టీ అధికారులు ఆడిట్‌కు సిద్ధమయ్యారు.