News January 29, 2025
వీరభద్రస్వామి జాతర ఆదాయం రూ.1,10,36,563

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం జాతర హుండీ ఆదాయం లెక్కించారు. సంక్రాంతి సందర్భంగా జరిగిన జాతర బ్రహ్మోత్సవాలలో టెండర్ల ద్వారా రూ.43,38,000, హుండీ రూ. 36,27,222, మొత్తం జాతర ఆదాయం రూ.1,10,36,563 సమకూరినట్లు ఈవో కిషన్ రావు తెలిపారు.మిశ్రమ బంగారం 8 గ్రా. వెండి 1.9 కిలోలు కానుకలు వచ్చాయన్నారు. గత జాతర కంటే రూ.16 లక్షల ఆదాయం అదనంగా వచ్చిందని చెప్పారు.
Similar News
News January 9, 2026
చిత్తూరులో గణతంత్ర వేడుకలపై సమీక్ష

గణతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్ఓ మోహన్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం చిత్తూరు కలెక్టరేట్లోని డీఆర్ఓ కార్యాలయంలో జనవరి 26వ తేదీన నిర్వహించనున్న 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ఆయా శాఖల జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఈ వేడుకలను పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఉదయం 7 గం.లకు ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఇన్ఛార్జ్గా చిత్తూరు ఆర్డీవో ఉంటారన్నారు.
News January 9, 2026
విశాఖ: గాలి నాణ్యత పెరిగేందుకు చర్యలు

విశాఖలో గాలి నాణ్యతను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్లో నిర్వహించిన DRC సమావేశంలో ఆయన మాట్లాడారు. సమిష్టి కృషితో ఇది సాధ్యమన్నారు. టార్పలిన్లు లేకుండా బొగ్గు, ఇసుక, ఇతర సామగ్రిని రవాణా చేయొద్దని సూచించారు. వ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News January 9, 2026
1100కు ఫోన్ చేయవచ్చు: కలెక్టర్

అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవాలన్నా కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. అలాగే అర్జీదారులు Meekosam.ap.gov.in వెబ్సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.


