News February 25, 2026
వృద్ధులు, మహిళలకు త్వరలోనే శుభవార్త!

TG: ఎన్నికల హామీల్లో మిగిలిన వాటినీ అమలు చేసేలా కొత్త స్కీమ్లపై GOVT దృష్టి సారించింది. వృద్ధాప్య పెన్షన్ ₹4000కు పెంపు, మహిళలకు ₹2500 సాయం, విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్ స్కీమ్లకు నిధుల అందుబాటుపై ఆర్థిక శాఖ ఇప్పటికే CMకు నివేదించింది. రానున్న బడ్జెట్లో వీటిని ప్రకటించనున్నట్లు సమాచారం. వీటికోసం ఆయా శాఖలు అందించే ప్రతిపాదనలపై బడ్జెట్ సమావేశాలకు ముందు క్యాబినెట్లో తుది నిర్ణయం తీసుకుంటారు.
Similar News
News April 12, 2026
మధిర: ఇంటర్ రిజల్ట్.. 1000/992 మార్కులు

మధిర మండలం జిలుగుమాడు గ్రామానికి చెందిన దోర్నాల ప్రశాంతి ఇంటర్ ఫలితాల్లో 1000కు 992 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రతిభ కనబరిచింది. మధిరలో పదో తరగతి పూర్తి చేసి, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఈ ఘనత సాధించింది. ప్రశాంతిని కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, స్నేహితులు అభినందించారు.
News April 12, 2026
మధిర: ఇంటర్ రిజల్ట్.. 1000/992 మార్కులు

మధిర మండలం జిలుగుమాడు గ్రామానికి చెందిన దోర్నాల ప్రశాంతి ఇంటర్ ఫలితాల్లో 1000కు 992 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రతిభ కనబరిచింది. మధిరలో పదో తరగతి పూర్తి చేసి, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఈ ఘనత సాధించింది. ప్రశాంతిని కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, స్నేహితులు అభినందించారు.
News April 12, 2026
హార్ముజ్లో టెన్షన్.. పాక్ ట్యాంకర్ యూటర్న్

హార్ముజ్ జలసంధి దగ్గర హైడ్రామా చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో 2 భారీ ఆయిల్ ట్యాంకర్లు చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నాయి. పాక్, ఇరాక్కు చెందిన ఈ నౌకలు ఒమన్ గల్ఫ్ నుంచి పర్షియన్ గల్ఫ్లోకి వెళ్లాల్సి ఉంది. కానీ ఇరాన్ దగ్గరకు రాగానే వెనక్కి వెళ్లాయి. నిజానికి పాక్, ఇరాక్ నౌకలకు తొలుత ఇరాన్ అనుమతి ఇచ్చింది. కానీ చర్చలు ఫెయిల్ కావటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.


