News February 13, 2025
వృద్ధ దంపతులు సూసైడ్.. కారణమిదే..!

ఖమ్మం బ్యాంక్ కాలనీలో <<15433998>>వృద్ధ దంపతులు సూ<<>>సైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కష్టపడి దాచుకున్న సొమ్ము అప్పుగా ఇస్తే.. తిరిగి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసినట్లు సమాచారం. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. వైద్యానికి డబ్బులేక మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారు రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.
Similar News
News October 13, 2025
పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయి: సీపీ

పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. హెడ్ కానిస్టేబుళ్ల నుంచి ఏఎస్సైగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులు సోమవారం కమిషనరేట్లో పోలీస్ కమిషనర్ను కలిశారు. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామానుజం తదితరులు పాల్గొన్నారు.
News October 12, 2025
వారినే వరించనున్న.. ఖమ్మం DCC, నగర అధ్యక్ష పదవి

ఖమ్మం DCC, నగర అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ఈ మేరకు AICC పరిశీలకుడు మహేంద్రన్ నేతల అభిప్రాయాలు సేకరించారు. ఈనెల 19 వరకు నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశమై, దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆరేళ్ల తర్వాత ఈ పదవులకు దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో ఆసక్తి నెలకొంది. పార్టీని మొదటి నుంచి నమ్ముకున్న వారికే ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ పదవులు ఎవరికిస్తే బాగుంటుంది. కామెంట్.
News October 11, 2025
ఖమ్మం: బావిలో పడి రైతు మృతి

తిరుమలాయపాలెం మండలం పడమటితండాకు చెందిన రైతు భూక్య భద్రు (కోటి) శనివారం తన వ్యవసాయ క్షేత్రంలోని బావిలో ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. పనులు చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.