News March 21, 2025
వెంకటగిరి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

గూడూరు నుంచి వెంకటగిరి వైపు వస్తున్న కారు వర్ధనంపాలెం సమీపంలో రోడ్డు పక్కన వడ్లను బస్తాల్లో నింపుతున్న కూలీలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారిలో రత్నమ్మ(55) అనే మహిళ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటగిరి ఎస్ఐ సుబ్బారావు తెలిపారు.
Similar News
News November 19, 2025
ఇంటర్మీడియట్ పరీక్షల్లో మార్పులు

AP: వచ్చే ఏడాది ఇంటర్ 1st ఇయర్ పరీక్షల్లో బుక్లెట్ పేజీలను 24నుంచి 32కు పెంచారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్కు 32 పేజీలు ఉంటాయి. బయాలజీలో వృక్షశాస్త్రం, జంతుశాస్త్రానికి 24పేజీల చొప్పున 2 బుక్లెట్లు ఇస్తారు. భౌతిక, రసాయన, జీవశాస్త్ర పరీక్షలు 85 మార్కులకు పాస్ మార్క్స్ 29. కొన్ని సబ్జెక్టుల్లో 30% వచ్చినా, మొత్తం 35% ఉంటే పాస్గా పరిగణిస్తారు.
News November 19, 2025
ఇతిహాసాలు క్విజ్ – 71

ఈరోజు ప్రశ్న: గణేశుడు మహాభారతాన్ని రాసేటప్పుడు తన దంతాన్ని ఎందుకు విరిచాడు?
☛ పై ప్రశ్నకు సమాధానాన్ని సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు జవాబు తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 19, 2025
ఉమెన్ డెవలప్మెంట్ & చైల్డ్ వెల్ఫేర్లో ఉద్యోగాలు

తిరుపతిలోని <


