News March 21, 2025
వెంకటగిరి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

గూడూరు నుంచి వెంకటగిరి వైపు వస్తున్న కారు వర్ధనంపాలెం సమీపంలో రోడ్డు పక్కన వడ్లను బస్తాల్లో నింపుతున్న కూలీలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారిలో రత్నమ్మ(55) అనే మహిళ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటగిరి ఎస్ఐ సుబ్బారావు తెలిపారు.
Similar News
News July 11, 2025
రాజంపేట: యువకుల మిస్సింగ్పై పవన్కు ఫిర్యాదు

రాజంపేటకు చెందిన ముగ్గురు యువకులు థాయిలాండ్లో ఉద్యోగానికి వెళ్లి అదృశ్యమయ్యారు. వాళ్ల అచూకీ కనిపెట్టాలని రాజంపేటకు చెందిన పూజారి గిరిజా కుమారి అనే మహిళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కోరారు. ఆయనకు యువకుల వివరాలు అందజేశారు. మహిళ ఫిర్యాదుతో డిప్యూటీ సీఎం కేంద్రంతో మాట్లాడారు. రాజంపేటలోని ఎస్వీ నగర్కు చెందిన ఓ యువకుడితో మరో ఇద్దరు 3నెలల కిందట థాయిలాండ్ వెళ్లగా వాళ్ల ఆచూకీ లభించలేదు.
News July 11, 2025
సారవకోట: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఆటో..ఒకరి మృతి

సారవకోట(M) కృష్ణాపురం సమీపంలో రహదారిపై గురువారం ఆగి ఉన్న లారీను వెనక నుంచి ఆటో బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్తో పాటు నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన శ్రీకాకుళం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. అమ్మనమ్మ (56) మృతి చెందింది. మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
News July 11, 2025
SRPT: తాటి చెట్టుపై నుంచి పడి కార్మికుడి మృతి

నూతనకల్ మండలం మిర్యాలలో తాటిచెట్టు పైనుంచి జారిపడి <<17026525>>గీత కార్మికుడు<<>> గురువారం మృతి చెందాడు. గ్రామానికి చెందిన అనంతుల లింగయ్య (50) రోజు మాదిరిగా కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లింగయ్య మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.