News July 24, 2024
వెంకటాపురం: రామప్పను సందర్శించిన పురావస్తుశాఖ డీఈ

రామప్ప ఆలయానికి హ్యాండ్ బాక్స్ టెక్నాలజీ వల్ల వెయ్యి ఏళ్ల వరకు డోకాలేదని పురావస్తుశాఖ అధికారులు తెలిపారు. వర్షాల వల్ల రామప్ప ఆలయం కురుస్తుందని వచ్చిన వార్త కథనాలను కేంద్ర పురావస్తు శాఖ డీఈ ఖండించారు. రామప్ప ఆలయానికి ఎలాంటి ముప్పు లేదని ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో అధికారులు చంద్రకాంత్, కృష్ణ చైతన్య, ప్రొఫెసర్ పాండురంగారావు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
Similar News
News November 8, 2025
ఖమ్మం: గన్ని సంచుల కొరత లేదు: అదనపు కలెక్టర్

ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో ధాన్యం కొనుగోలుకు గన్ని సంచులు సమృద్ధిగా ఉన్నాయని, ప్రతిపాదనలు పంపిన 48 గంటల్లోనే సరఫరా జరుగుతోందని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాలకు 9,71,500 గన్ని సంచులు పంపిణీ చేశామన్నారు. రైతుల ఇళ్లకు సంచులు ఇవ్వవద్దని స్పష్టమైన ఆదేశాలున్నాయని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచులు, టార్పాలిన్ కవర్లు సమృద్ధిగా ఉన్నాయన్నారు.
News November 8, 2025
ఖమ్మం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఇన్ఛార్జి హల్చల్

ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఇన్ఛార్జి అధికారి హడావుడి కలకలం రేపింది. సెలవులో ఉన్న రెగ్యులర్ డీఎంహెచ్ఓ పేరుతోనే ఆయన ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ‘నేనే డీఎంహెచ్ఓ’ అంటూ సిబ్బందితో చెప్పడం, ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీ కమిటీలో తన అనుచరులకే చోటు కల్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదాస్పద తీరుపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
News November 8, 2025
ఖమ్మం: సైబర్ నేరగాళ్లకు 23 నెలల జైలు

సైబర్ నేరాలకు పాల్పడిన రాజస్థాన్కు చెందిన ఇద్దరు నిందితులకు ఖమ్మం కోర్టు శిక్ష ఖరారు చేసింది. నిందితులు మహిర్ అజాద్(25), వకీల్(22)పై కేసు నమోదు చేసి, సీపీ సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీసులు సాక్ష్యాలతో చార్జ్షీట్ దాఖలు చేశారు. విచారణలో వారి నేరం నిర్ధారణ కావడంతో న్యాయమూర్తి పి.నాగలక్ష్మి నిందితులకు 23 నెలల 2 రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించారు.


