News February 1, 2025
వెదురు వస్తువుల తయారీతో ఆర్థికాభివృద్ధి: అదనపు కలెక్టర్

వెదురు వస్తువుల తయారీతో సంఘాల ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. ఆసిఫాబాద్ మండలం సాలెగూడలో నిర్మాణంలో ఉన్న వెదురు ప్రాసెసింగ్ యూనిట్ సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెదురుతో వినూత్న వస్తువులు తయారు చేసే ప్రణాళిక రూపొందించాలన్నారు. యూనిట్ పూర్తిచేసే లోపు అవసరమైన వెదురు నిల్వల సేకరణకు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
Similar News
News October 28, 2025
‘మొంథా’ తుఫాను సమాచారం.. ఎప్పటికప్పుడు!

మొంథా తుఫాను ప్రభావంతో బలమైన ఈదురు గాలులు, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. తాజా వాతావరణ సమాచారం, అధికారుల సూచనలు, సహాయక చర్యల వివరాలు తెలుసుకోవడానికి ‘Way2News’ను ఫాలో అవ్వండి. కచ్చితమైన, తాజా అప్డేట్లను అందిస్తూ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడంలో వే2న్యూస్ తోడుగా ఉంటుంది.
News October 28, 2025
ఫేక్ ప్రచారాలు చేసే వారిపై చర్యలు: సీపీ

విజయవాడలోని బుడమేరు పొంగుతుందని ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడానికి కొంతమంది ఫేక్ సమాచారాన్ని స్ప్రెడ్ చేస్తున్నారని సీపీ రాజశేఖర్ బాబు అన్నారు. ప్రజలు ఎవరూ కూడా అపోహలను నమ్మొద్దని చెప్పారు. తుపానుపై ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం పనిచేస్తుందని, ప్రజలకు అందుబాటులో ఉంటుందన్నారు. ఫేక్ ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News October 28, 2025
విదేశాల్లో జాబ్ చేయాలనుకుంటున్నారా?

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జర్మనీలో మెకానిక్ ఉద్యోగాల భర్తీకి ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఐటీఐ/డిప్లొమా/బీటెక్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 10వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. నెలకు రూ.2.50లక్షల నుంచి రూ.3 లక్షల వరకు జీతం చెల్లిస్తారు. వెబ్సైట్: https://naipunyam.ap.gov.in/


