News February 27, 2025
వెబ్ ల్యాండ్ నుంచి ఎమ్మెల్యే ఆస్తుల తొలగింపు

రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి భార్య జ్యోతమ్మ, తమ్ముడు అనిల్ కుమార్ రెడ్డి, మరదలు సృజన పేరుతో ఉన్న భూములను మంగళవారం వెబ్ ల్యాండ్ నుంచి తొలగించినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. రాజంపేట మండలంలో ఉన్న 30.13 ఎకరాల ప్రభుత్వ భూమిగా నమోదు చేశారు. మందపల్లి సర్వేనంబర్ 814-3లో 4 ఎకరాలు, 814-4లో 5 ఎకరాలు, 815-1,2 లో 8.79 ఎకరాలు, 816-2 లో 4.31 ఎకరాలు, ఆకేపాడు 56/8,9లో 8.03 ఎకరాలు.
Similar News
News February 27, 2025
EAPCET ప్రవేశాల్లో సవరణలు

తెలంగాణలో ఇంజినీరింగ్, వృత్తివిద్య కోర్సుల్లో ప్రవేశాలకు <
News February 27, 2025
NZB జిల్లాలో ఎంత శాతం పోలింగ్ నమోదైందంటే?

నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో కూడిన కరీంనగర్ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ నిజామాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 81 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. కాగా పోలింగ్ ముగిసే సమయానికి పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 76.78 శాతం, ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 92.46 శాతం పోలింగ్ నమోదయ్యింది.
News February 27, 2025
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 94.96 శాతం పోలింగ్

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 23 పోలింగ్ కేంద్రాల్లో 2,664 మంది మంది ఓటర్లకు గాను 2,530 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 1,702 మందికి గాను 1,619, మహిళలు 962 మందికి గాను 911 మంది ఓటు వేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 94.96 శాతం పోలింగ్ నమోదయింది.