News March 6, 2025
వెలుగొండకు చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే.!

సీఎం చంద్రబాబు ఈనెల 8న ప్రకాశం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టును సందర్శించనున్నారు. అంతకు ముందే మార్కాపురంలో మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమంలో CM పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం 12:30 నుంచి <<15657223>>1:30 వరకు నాయకులతో<<>> సమావేశమౌతారు. ఆ తర్వాత మధ్యహ్నం 2 గంటలకు దోర్నాల మండలంలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ వద్దకు చేరుకుంటారు. సాయంత్రం 4:30 వరకు ప్రాజెక్ట్ను పరిశీలించి తిరుగుపయనమౌతారు.
Similar News
News March 6, 2025
ఒంగోలు: 30 మండలాలకు అధ్యక్షుల ప్రకటన

రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లాలోని 30 మండలాలకు పార్టీ అధ్యక్షులను నియమించినట్లు డీసీసీ అధ్యక్షుడు షేక్. సైదా ప్రకటించారు. ఈ సందర్భంగా సైదా మాట్లాడుతూ.. జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారం కోసం నిరంతర పోరాటం చేయాలని అన్నారు. షర్మిలారెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవడానికి సమష్టిగా కృషి చేస్తామని అన్నారు.
News March 6, 2025
అధికారులకు కీలక సూచనలు చేసిన ప్రకాశం కలెక్టర్

ఈనెల 8వ సీఎం చంద్రబాబు మార్కాపురం పర్యటన నేపథ్యంలో అధికారులకు కలెక్టర్ తమిమ్ ఆన్సరియా కీలక సూచనలు చేశారు. కేటాయించిన విధులను తూచా తప్పకుండా పాటిస్తూ అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. బందోబస్తు ఏర్పాట్లు, వీఐపీ, జనరల్ పబ్లిక్ పార్కింగ్ ఏర్పాట్లు, స్టాల్స్ ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
News March 6, 2025
ఒంగోలు: పిల్లలు చెప్పిన మాట వినలేదని తల్లి సూసైడ్

ఒంగోలు నగరం ధారావారితోటలో వివాహిత కె.లక్ష్మీభవానీ(34) మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలతోపాటు పిల్లలు కూడా చెప్పిన మాట వినడంలేదంటూ క్షణికావేశంలో ఇంట్లో చున్నీతో ఉరి వేసుకుంది.ఈ విషయం గమనించిన కుటుంబసభ్యులు ఆమెను రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మీభవాని మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్ టౌన్ సీఐ నాగరాజు చెప్పారు.