News July 31, 2024
వెలుగోడు జలాశయానికి పెనుముప్పు.. కట్టపై భారీ గొయ్యి
వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టపై భారీ గొయ్యి ఏర్పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు కట్ట దెబ్బతిన్నా అధికారులు గుర్తించలేదని, ఏదైనా ప్రమాదం జరిగితే భారీ నష్టం జరిగే అవకాశముందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం వెలుగోడు జలాశయంలోకి శ్రీశైలం జలాలు చేరుతున్నాయి. వెలుగోడు జలాశయ సామర్థ్యం 16.95 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 2.136 టీఎంసీల నీరు చేరింది.
Similar News
News October 8, 2024
‘పార్టీ బలోపేతానికి పూర్తిస్థాయిలో కృషి చేయాలి’
పార్టీ బలోపేతానికి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పూర్తి స్థాయిలో కృషి చేయాలని ఆ జిల్లాల వైసీపీ అధ్యక్షులు ఎస్సీ మోహన్ రెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి సూచించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్లో నాయకులతో సమావేశం నిర్వహించారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ బలోపేతం కావాలన్నారు. కార్యక్రమంలో ఆలూరు, మంత్రాలయం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
News October 8, 2024
స్వర్ణాంధ్ర@2047 డాక్యుమెంట్ రూపకల్పన: మంత్రి భరత్
ఐదేళ్ల అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర@2047 డాక్యుమెంట్ రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర @2047 జిల్లా దార్శనిక ప్రణాళిక (2024-29) రూపకల్పనపై సమావేశం నిర్వహించారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ గ్రోత్ ఇంజిన్ అని, దీని వల్ల జిల్లాలో గణనీయమైన అభివృద్ధి సాధించనున్నామని తెలిపారు. దాదాపుగా రూ.2,800 కోట్లతో ఓర్వకల్లు నోడ్ అభివృద్ధి కానుందని తెలిపారు.
News October 7, 2024
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 519 దరఖాస్తులు!
ఉ.కర్నూలు జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటివరకు నంద్యాల జిల్లాలో 105 మద్యం దుకాణాలకు గానూ 217, కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు గానూ 302 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు ఇక మూడు రోజులే గడువుంది. అయితే జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు వేయొద్దని, వాటిని తమకు వదిలేయాలని వ్యాపారులను హెచ్చరిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి.