News April 1, 2025

వెల్గటూర్: అనారోగ్యంతో యువకుడి మృతి

image

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పైడిపల్లి గ్రామానికి చెందిన బండారి జన్ పాల్ (19)అనే యువకుడు అనారోగ్యంతో సోమవారం మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడు నెలలుగా జాన్ పాల్ కడుపు నొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పేర్కొన్నారు.

Similar News

News November 12, 2025

కాకినాడ జిల్లాలో సెక్షన్ 30 అమలు

image

కాకినాడ జిల్లాలో మంగళవారం నుంచి సెక్షన్ 30 అమలులోకి తెచ్చినట్లు ఎస్పీ బిందు మాధవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, నిరసనలు, ఆందోళనలు నిర్వ హించడానికి వీలు లేదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఐపీసీ సెక్షన్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ఉండేందుకు ఈ సెక్షన్ అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

News November 12, 2025

చైనాకు భారత జనరిక్ మెడిసిన్!

image

భారత్ విషయంలో చైనా క్రమంగా నిబంధనలు సడలిస్తోంది. జనరిక్ ఔషధాలను దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది. గత నెలలో నిర్వహించిన టెండర్‌లో సిప్లా, నాట్కో, హెటిరో, రెడ్డీస్ వంటి ఫార్మా సంస్థలు చైనా ప్రభుత్వ నిర్వహణలోని ఆసుపత్రులకు జనరిక్ మందులను సరఫరా చేసే కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి. ఈ సంస్థలు ‘డపాగ్లిఫ్లోజిన్’ అనే మధుమేహ నియంత్రణ టాబ్లెట్లను సప్లై చేయనున్నాయి. ఇతర టాబ్లెట్లూ సరఫరా చేయనున్నాయి.

News November 12, 2025

నేడు కర్నూలుకు గవర్నర్ రాక

image

గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నేడు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు విజయవాడ ఎయిర్‌పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరుతారు. 10.30కి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 11 నుంచి నుంచి మధ్యాహ్నం 12.15 వరకు జరిగే RU నాలుగో కాన్వొకేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. సా. 4.10కు కర్నూలు నుంచి బయలుదేరి 4.40కు విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.