News April 10, 2025
వెల్గటూర్: తండ్రి హత్య కేసులో కొడుకుకి జీవిత ఖైదు

తండ్రిని హత్య చేసిన కేసులో కొడుకుకి జీవిత ఖైదు, రూ.6,000 జరిమానా విధిస్తూ జగిత్యాల న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చారు. వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గొడిసెలపేటకి చెందిన రెబ్బస్ పోచయ్యను 2022 సంవత్సరంలో తన పెద్ద కొడుకు లచ్చయ్య భూమి విషయంలో తలపై కర్రతో బలంగా కొట్టడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు విచారణ అనంతరం జీవిత ఖైదు, జరిమానా విధించినట్లు తెలిపారు.
Similar News
News December 6, 2025
కర్నూలు కలెక్టర్ నేతృత్వంలో పంటపై సమీక్ష.!

కర్నూలు కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జిల్లా కలెక్టర్ డా. ఏ.సిరి వివిధ పంటల మార్కెటింగ్పై ట్రేడర్లతో సమీక్ష నిర్వహించారు. రైతులకు న్యాయమైన ధర లభించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, వ్యవసాయ అధికారులతోపాటు అనుబంధ శాఖల అధికారులు ఉన్నారు.
News December 6, 2025
విశాఖలో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ నిర్మాణానికి శంఖుస్థాపన

విశాఖ తూర్పు నియోజకవర్గం ముడసర్లోవలో రూ.62 కోట్లతో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్కు ఎంపీ శ్రీభరత్, విప్ చిరంజీవిరావు, ఎమ్మెల్యే వెలగపూడి శంఖుస్థాపన చేశారు. రాష్ట్రానికి మంజూరైన 5 హాస్టళ్లలో 3 విశాఖకే దక్కడం విశేషం. సీఎం చంద్రబాబు కృషి, కేంద్ర నిధుల సద్వినియోగంతోనే ఈ అభివృద్ధి సాధ్యమైందని విప్ చిరంజీవిరావు తెలిపారు. ఈ ఐదంతస్తుల భవనం ఉద్యోగినులకు సురక్షిత వసతిని అందిస్తుందన్నారు.
News December 6, 2025
ECIL హైదరాబాద్లో ఉద్యోగాలు

హైదరాబాద్లోని<


