News March 29, 2025

వెల్దండలో ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహ పరిశీలన

image

వెల్దండ మండల కేంద్రంలో ప్రజా యుద్ధనౌక గద్దర్ విగ్రహం నిర్మాణం జరుగుతుంది. శనివారం గద్దర్ విగ్రహ ఏర్పాటు కమిటీ ఆధ్వర్యంలో నాయకులు గద్దర్ విగ్రహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గద్దర్ విగ్రహ కమిటీ నాయకులు భిక్షపతి, గోపాల్ తదితరులు మాట్లాడుతూ.. విగ్రహం పూర్తయిన వెంటనే నియోజకవర్గ కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు ప్రతిష్ఠిస్తామని వారు పేర్కొన్నారు.

Similar News

News November 16, 2025

ఆస్పత్రి నుంచి గిల్ డిశ్చార్జ్.. రెండో టెస్టులో ఆడతారా?

image

టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయనకు మెడ నొప్పి తగ్గినప్పటికీ 4-5 రోజులపాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. ఈ నెల 22 నుంచి గువాహటిలో జరిగే రెండో టెస్టులో ఆయన ఆడేందుకు 50-50 ఛాన్సెస్ ఉన్నాయని పేర్కొన్నాయి. సౌతాఫ్రికాతో తొలి టెస్టులో బ్యాటింగ్ చేస్తుండగా మెడ నొప్పితో గిల్ బాధపడ్డారు. దీంతో మైదానాన్ని వీడి ఆస్పత్రిలో చేరారు.

News November 16, 2025

వైసీపీ నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు: ప్రణవ్

image

సీఐఐ భాగస్వామ్య సదస్సు విజయవంతం కావటంతో వైసీపీ నేతలకు మింగుడు పడటం లేదని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. ఫ్యూచర్ రెడీ ఇన్నోవేషన్ రాష్ట్రంగా ఏపీని సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. పెద్దఎత్తున ఒప్పందాలు జరగటంతో వైసీపీ నేతలు భయపడి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కోడిగుడ్డు మంత్రిగా పేరొందిన అమర్ నాథ్ ఉన్న ఐదేళ్లలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదన్నారు.

News November 16, 2025

లైటింగ్ పెంచడంతోనే పేలుడు!

image

J&K నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన <<18295101>>పేలుడుకు<<>> అధిక లైటింగే కారణమై ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ‘ఫరీదాబాద్ ఉగ్ర నెట్‌వర్క్ కేసులో స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల్లో ద్రవరూప రసాయనాలు కూడా ఉన్నాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించేందుకు ఫోరెన్సిక్ బృందాలు లైటింగ్ పెంచాయి. దీంతో వెలువడిన వేడి లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్ నుంచి వచ్చిన పొగలు ఆ రసాయనంతో కలిసి పేలుడు జరిగి ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.