News January 28, 2025
వెల్దుర్తి: పొలంలో పడి యువరైతు మృతి

పొలం పనులకు వెళ్లిన ఓ యువ రైతు ప్రమాదవశాత్తు పొలంలో పడి మృతి చెందిన ఘటన వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. హకీంపేటకు చెందిన పత్తి చేతన్(35) మంగళవారం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందారు. భార్య రజిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News February 17, 2025
కొల్చారం: బైక్, ఆర్టీసీ బస్సు ఢీ.. యువకుడి మృతి

కొల్చారం శివారులో అదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. దీంతో బైక్ పై ఉన్న కౌడిపల్లి మండలం కన్నారం గ్రామానికి చెందిన రాజేందర్(27) అక్కడికక్కడే మృతి చెందారు. మెదక్ నుంచి తన స్వగ్రామం కన్నారం వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యాడు.
News February 16, 2025
శివంపేట: చోరీ కేసులో నలుగురు అరెస్టు

శివంపేట మండలం పెద్ద గొట్టిముక్కుల గ్రామ శివారులోని భవ్యస్ ఫార్మసిటికల్ కంపెనీలో ఈనెల 15న జరిగిన చోరీ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పరిశ్రమలో అర్ధరాత్రి వేళ ఇనుప సామాగ్రి చోరి చేయగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుమ్మడిదల గ్రామానికి చెందిన వెంకటేష్, ఆంజనేయులు, బ్రహ్మచారి, ధర్మేందర్లను అరెస్ట్ చేసి డిమాండ్కు తరలించారు.
News February 16, 2025
మెదక్: సాంఘిక సంక్షేమ కళాశాలను సందర్శించిన కలెక్టర్

జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలల్లో మెనూ పగడ్బందీగా అమలు చేయడం హర్షనీయమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. ఆదివారం మెదక్ రైల్వే స్టేషన్ సమీపంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు. వంటకు వినియోగిస్తున్న సరుకులను పరిశీలించారు. ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.