News July 1, 2024
వెల్దుర్తి: వైన్స్కు కన్నం.. నగదు చోరీ

వెల్దుర్తి మండల కేంద్రంలోని తిరుమల వైన్స్లో సుమారు రూ. 55 వేల నగదు చోరీ జరిగింది. రాత్రి సమయంలో గుర్తుతెలియని దొంగలు వైన్స్ వెనుక వైపు కన్నం వేసి వైన్ షాపులో ఉన్న నగదు చోరీ చూశారు. అలాగే వెల్దుర్తిలో దంతాన్పల్లికి చెందిన శేఖర్ కిరాణా దుకాణం, చందుకు చెందిన మొబైల్ షాప్లో చోరీ చేసేందుకు ప్రయత్నం చేశారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News October 24, 2025
తల్లి, కూతురు మృతితో పాపన్నపేట, శివ్వాయిపల్లిలో విషాదం

బస్సు దగ్ధం ఘటనలో తల్లి కూతుళ్లు సజీవ దహనం కాగా మెట్టినిల్లు మెదక్ మండలం శివ్వాయపల్లి, పుట్టినిల్లు పాపన్నపేటలో తీవ్ర విషాదం అలుముకుంది. విదేశాల్లో ఉంటున్న ఆనంద్ కుటుంబం అప్పుడప్పుడు కుటుంబీకులను పలకరించేందుకు వచ్చి వెళ్లే వారు. ఇలా ప్రమాదంలో మృతిచెందడంతో పలువురు కన్నీరుమున్నీరవుతున్నారు. సంధ్యారాణి పాపన్నపేట మాజీ సర్పంచ్ గురుమూర్తి సోదరి. రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.
News October 24, 2025
మెదక్: జిల్లా యువజన క్రీడల అధికారిగా రమేష్

జిల్లా యువజన క్రీడల నిర్వహణ అధికారిగా జి.రమేష్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. తూప్రాన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న జి.రమేష్ జిల్లా యువజన, క్రీడల అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా కలెక్టర్ రాహుల్ రాజ్ను కలిశారు. ఆయన వెంట జిల్లా విద్యా శాఖాధికారి ప్రొ.రాధాకిషన్, ఏఎంఓ సుదర్శన్ మూర్తి ఉన్నారు.
News October 24, 2025
MDK: ‘ఆశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకం’

రాజీవ్ యువ వికాస పథకం నిరుద్యోగ యువతను ఆశపెట్టిందని చెప్పొచ్చు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సుమారు లక్ష మంది వరకు దరఖాస్తులు చేసుకున్నారు. దీంట్లో సిబిల్ స్కోర్ను బట్టి లబ్దిదారుల ఎంపిక నిర్వహిస్తున్నారు. ఐతే ఇప్పటికీ ఈ పథకం పై లబ్ధిదారుల వివరాలు అధికారులు తెలపలేదు. ఈ పథకం ద్వారా సొంత వ్యాపార నిమిత్తం రూ.5 లక్షల రుణం ప్రభుత్వం ఇస్తుంది. ఆశ పెట్టి వదిలేశారని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.


