News April 15, 2025
‘వెళ్లొస్తాం.. సళేశ్వరం లింగమయ్యా..!’

నల్లమలలోని లోతట్టు ప్రాంతం సళేశ్వర క్షేత్రంలో వెలసిన లింగమయ్య ఉత్సవాలు ఆదివారం ముగిశాయి. మూడు రోజులపాటు నల్లమల కొండలు జనసంద్రంతో కిక్కిరిసి కనిపించాయి. చివరిరోజు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి వాహనాలు అడవిలోకి వెళ్లకుండా అటవీ శాఖ నిలిపివేసింది. చివరిరోజు వెళ్లొస్తాం.. లింగమయ్యా అంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు.
Similar News
News November 21, 2025
మరికొన్ని ఎర పంటలు- ఈ పంటలకు మేలు

☛ క్యాబేజీలో డైమండ్ బ్యాక్ మాత్ను ఆవాలు పంట వేసి నివారించవచ్చు.☛ అలసందలో ఆవాలు వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు. ☛ బంతిని ఎర పంటగా వేసి, కంది పంటను ఆశించే శనగపచ్చ పురుగును అరికట్టవచ్చు. ఈ జాతికి చెందిన ఆడ పురుగులు బంతి పూలపై గుడ్లు పెడతాయి. ఆ తర్వాత లార్వాను సేకరించి నాశనం చేయొచ్చు. ☛ టమాటాలో కాయతొలుచు పురుగు ఉద్ధృతిని తగ్గించడానికి బంతిని ఎర పంటగా వేయాలి.
News November 21, 2025
వేగంగా విస్తరిస్తోన్న విశాఖ

GDPలో దేశంలో టాప్-10 నగరాలలో నిలిచిన విశాఖ నగరం వేగంగా విస్తరిస్తుంది. కార్పొరేషన్గా ఉన్న విశాఖపట్నం తరువాత గాజువాక, భీమిలి, అనకాపల్లి మున్సిపాలిటీల విలీనంతో మహా విశాఖ నగర పాలక సంస్థగా ఏర్పడింది. ఇప్పుడు అనకాపల్లి నుంచి విజయనగరం వరకు అభివృద్ధితో వేగంగా దూసుకుపోతుంది. ఒక వైపు భోగాపురం ఎయిర్ పోర్టు, మరోక వైపు డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు వస్తున్నాయి.CII సమ్మిట్లో పెద్ద ఎత్తన పెట్టుబడులు వచ్చాయి.
News November 21, 2025
24 నుంచి కొత్త కార్యక్రమం

AP: సాగును లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నెల 24 నుంచి ‘రైతన్నా మీకోసం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. వారంపాటు జరిగే ఈ ప్రోగ్రామ్లో భాగంగా అధికారులు, ప్రజాప్రతినిధులు అన్నదాతల ఇళ్లకు వెళ్తారు. పురుగుమందుల వాడకంతో నష్టాలు, నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతుపై అవగాహన కల్పిస్తారు. అలాగే DEC 3న RSKల పరిధిలో వర్క్షాపులు నిర్వహిస్తారు.


