News February 26, 2025

వేంపాడులో లారీ ఢీకొని కాకినాడ జిల్లా వాసి మృతి

image

నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందినట్లు ఎస్సై సన్నిబాబు మంగళవారం తెలిపారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలుకు చెందిన చిక్కాల శ్యాంప్రసాద్ (29) వేంపాడు వద్ద ఫ్యాబ్రిక్స్ వర్క్స్ షాపులో పని చేస్తున్నాడు. స్నేహితుడితో కలిసి బైక్‌పై టోల్ ప్లాజా వద్ద టీపాయింట్‌కు వెళుతుండగా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్యాం ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Similar News

News January 3, 2026

కొండగట్టులో పవన్‌కు స్వాగతం పలికిన అర్చకులు

image

కొండగట్టు అంజన్న ఆలయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, పలువురు నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News January 3, 2026

వరి మాగాణుల్లో జీరో టిల్లేజ్ పొద్దుతిరుగుడు సాగు

image

ఖరీఫ్ వరి కోతలు ఆలస్యమైన ప్రాంతాల్లో జీరోటిల్లేజ్ పద్ధతిలో పొద్దుతిరుగుడును జనవరి 2వ వారం నుంచి ఫిబ్రవరి తొలి వారం వరకు విత్తుకోవచ్చంటున్నారు వ్యవసాయ నిపుణులు. ఈ విధానంలో సంకర రకాలతోనే ఎక్కువ దిగుబడి వస్తుంది. తిలన్ టెక్-ఎస్.యు.యెన్.హెచ్-1, N.D.S.H.-1012, కె.బి.ఎస్.హెచ్-44, డి.ఆర్.ఎస్.హెచ్-1 ఇతర ప్రైవేటు సంస్థల హైబ్రిడ్ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎకరానికి 2.5-3.0 కిలోల విత్తనం సరిపోతుంది.

News January 3, 2026

కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్ కళ్యాణ్

image

ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆయన ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. దర్శనానంతరం బయటకు వస్తూ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు సెల్యూట్ చేశారు. పవన్ అభిమానులతో కొండగట్టు కిక్కిరిసిపోయింది.