News March 19, 2025

వేగవంతంగా కమర్షియల్ ట్రేడ్ వసూలు చేయండి: బల్దియా కమిషనర్

image

కమర్షియల్ ట్రేడ్ వేగవంతంగా వసూలు చేయాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. కమర్షియల్ ట్రేడ్ పన్ను వసూళ్లపై ప్రజారోగ్య విభాగ ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్లతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు. ప్రతి రోజు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న కమర్షియల్ షాపుపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.

Similar News

News March 20, 2025

నంద్యాల జిల్లాకు భారీ వర్ష సూచన

image

నంద్యాల జిల్లాల్లో ఈనెల 23న చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని గురువారం ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రజలు చెట్ల కింద నిలబడరాదని సూచించింది. వ్యవసాయ కూలీలు పోలాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరింది. కాగా మరోవైపు జిల్లాలో గత కొద్దిరోజులుగా ఎండలు దంచికొడుతున్న తరుణంలో వర్ష సూచన శుభవార్త అనే చెప్పవచ్చు.

News March 20, 2025

NLG: నాలుగేళ్లుగా టీఏ, డీఏలకు అతీగతీ లేదు!

image

జిల్లాలో పనిచేస్తున్న అంగన్‌వాడీ టీచర్లకు నాలుగేళ్ల నుంచి టీఏ, డీఏలకు అతీగతీ లేకుండాపోయింది. గతంలో ప్రతి నెలా రెండు మీటింగ్‌లకు రూ.500 చెల్లించేవారు. ఆ తర్వాత ప్రతి నెల ఒక సమావేశానికే టీఏ, డీఏ చెల్లిస్తామని అధికారులు ప్రకటించారు. ఒక్కో అంగన్‌వాడీ టీచరుకు కనీసం రూ.20 వేల వరకు టీఏ, డీఏ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇక కూరగాయలు, వంట సామగ్రి, గ్యాస్‌ సిలిండర్లకు చెల్లింపులను అసలే పట్టించుకోవడంలేదు.

News March 20, 2025

GOOD NEWS: షుగర్, ఊబకాయానికి మందు వచ్చేస్తోంది!

image

డయాబెటిస్, అధిక బరువుతో బాధపడేవారికి ఎలీ లిల్లీ సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. వాటి చికిత్సకు ఉపకరించే ఔషధాన్ని మౌంజారో పేరిట భారత మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఔషధం 2.5 మి.గ్రా ధరను రూ.3500గా, 5 మి.గ్రా ధరను రూ.4375గా నిర్ణయించింది. ఇది ఇప్పటికే పలు దేశాల్లో అందుబాటులో ఉండగా భారత్‌లోకి రావడం ఇదే తొలిసారి. దేశంలో షుగర్, ఒబేసిటీ బాధితులు 10కోట్లకు పైగానే ఉంటారని ఓ అంచనా.

error: Content is protected !!