News March 19, 2025

వేగవంతంగా కమర్షియల్ ట్రేడ్ వసూలు చేయండి: బల్దియా కమిషనర్

image

కమర్షియల్ ట్రేడ్ వేగవంతంగా వసూలు చేయాలని బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే అధికారులను ఆదేశించారు. కమర్షియల్ ట్రేడ్ పన్ను వసూళ్లపై ప్రజారోగ్య విభాగ ఉన్నతాధికారులు డిప్యూటీ కమిషనర్లతో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ పాల్గొని సమర్థవంతంగా నిర్వహించేందుకు తగిన సూచనలు చేశారు. ప్రతి రోజు పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్న కమర్షియల్ షాపుపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు.

Similar News

News April 23, 2025

వరంగల్: మూడు రోజులుగా స్థిరంగా పత్తి ధర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో పత్తి ధర మూడు రోజులుగా తటస్థంగా ఉంది. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,560 పలకగా.. మంగళవారం అదే ధర పలికింది. బుధవారం సైతం అదే రూ. 7560 ధర పలికినట్లు వ్యాపారులు తెలిపారు. నేడు మార్కెట్‌కు పత్తి తరలి రాగా.. మార్కెట్‌లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. 

News April 23, 2025

కామారెడ్డి: ఇంటర్ ఫెయిల్.. విద్యార్థిని ఆత్మహత్య

image

ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో బిక్కనూర్‌కి చెందిన పూజ (18) సూసైడ్ చేసుకుంది. ఇవాళ తెల్లవారుజామున ఒంటిపై పెట్రోల్ పోసుకొని బలవన్మరణానికి పాల్పడింది. పూజకు తల్లిదండ్రులు లేకపోవడంతో నానమ్మ వద్దే ఉంటూ చదువుకుంటోంది. పూజ మృతితో బిక్కనూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. 

News April 23, 2025

బాపట్ల : ర్యాంకింగ్‌లో మెరుగు.. ఉత్తీర్ణతా శాతంలో తరుగు

image

ఇవాళ విడుదలైన టెన్త్ ఫలితాలలో బాపట్ల విద్యార్థులు సత్తాచాటారు. గతేడాది 88.19 పాస్ పర్సెంటేజ్‌తో జిల్లా 14 స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పాస్ పర్సంటేజీ తగ్గింది. 83.96 శాతంతో 12 వస్థానంలో నిలిచింది.

error: Content is protected !!