News December 11, 2024
వేగుచుక్క.. నాగార్జునసాగర్

కరవుకాటకాలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలకు వేగుచుక్కలా నిలిచింది నాగార్జునసాగర్ ప్రాజెక్టు. 1955 డిసెంబరు 10న నాటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. NLG జిల్లా నందికొండ వద్ద కృష్ణ నదిపై ఈ ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద మానవ నిర్మిత ప్రాజెక్టుగా సాగర్ ప్రసిద్ధి చెందడం తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణం.
Similar News
News December 23, 2025
నల్గొండ జిల్లాలో నేటి టాప్ న్యూస్

చింతపల్లి: ర్యాలీపై దాడి.. పలువురికి గాయాలు
నల్గొండ: ప్రజావాణికి 53 దరఖాస్తులు
మునుగోడులో జీవో ప్రతులు దహనం
నల్గొండలో భారీ నిరసన
మిర్యాలగూడ: రైల్వే ట్రాక్ వద్ద మృతదేహం
కొండమల్లేపల్లి: సర్పంచ్ ఇంటిపై దాడి
చండూరు: కుమారుడి ప్రమాణ స్వీకారం రోజే తండ్రి మృతి
అమెరికాలో నల్గొండ యువకుడి మృతి
నల్గొండ: మరో పథకానికి మంగళం
News December 22, 2025
NLG: ప్రజావాణికి 53 దరఖాస్తులు

నల్గొండ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి బాధితులు తరలివచ్చారు. వివిధ సమస్యలపై 53 మంది అర్జీలు సమర్పించారు. ఇందులో రెవెన్యూ శాఖకు 26, తక్కిన 27 దరఖాస్తులు వివిధ శాఖలకు సంబంధించి వచ్చాయి. అంతకుముందు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా, విజయవంతంగా పూర్తి చేసినందుకు ఎన్నికల విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.
News December 22, 2025
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపాలి: నల్గొండ కలెక్టర్

విద్యార్థులు ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళనకరమని, వారిలో ధైర్యాన్ని నింపి చదువుపై ఆసక్తి కలిగించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. గురుకులాల్లో విద్యార్థులకు నిరంతరం కౌన్సెలింగ్ నిర్వహించాలని, చదువుల భారం వల్ల కలిగే మానసిక ఒత్తిడిని తగ్గించేలా స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని సూచించారు.


