News June 22, 2024

వేటపాలెం: ఒడ్డుకు కొట్టుకొచ్చిన మరో ఇద్దరు యువకుల మృతదేహాలు

image

బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో శుక్రవారం రాకాసి అలల తాకిడికి గల్లంతైన మరో ఇద్దరు యువకుల మృతదేహాలు శనివారం ఉదయం వాడరేవు వద్ద ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి. మొత్తం నలుగురు యువకులు గల్లంతు కాగా శుక్రవారం సాయంత్రమే రెండు మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకురావడం తెలిసిందే. మృతులు ఏలూరు జిల్లా దుగ్గిరాల వాసులుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు లాంఛనాలు పూర్తిచేసి మృతదేహాలను బంధువులకు అప్పగించారు.

Similar News

News October 5, 2024

ఒంగోలులో ఈనెల 8న మినీ జాబ్ మేళా

image

జిల్లా ఉపాధి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృధి సంస్థ, సీడప్ ఒంగోలువారి ఆధ్వర్యంలో అక్టోబరు 8న, ఒంగోలు ప్రభుత్వ బాలికల ITI కాలేజీలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు.ITI, డిడిప్లొమా, టెన్త్, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసి 18 సం. నుంచి 30సం. లోపు మధ్య వయసు గల అభ్యర్థులు అర్హులని జిల్లా అధికారులు రవితేజ, భరద్వాజ్‌లు తెలియజేశారు.

News October 5, 2024

ఒంగోలు ట్రిపుల్ ఐటీకి 6 నుంచి దసరా సెలవులు

image

రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న ఒంగోలు, నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు, ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ శనివారం తెలిపారు. తిరిగి క్లాసులు ఈనెల 14 నుంచి పునః ప్రారంభమవుతాయని చెప్పారు.

News October 5, 2024

ప్రకాశం: టెట్‌ పరీక్షలకు 63 మంది గైర్హాజరు

image

ప్రకాశం జిల్లాలో టీచర్స్‌ ఎలిజిబులిటీ టెస్టు రెండో రోజు శుక్రవారం పరీక్షలకు 63 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని జిల్లా విద్యాశాఖ అధికారి బి సుభధ్ర తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు సెంటర్లలో పరీక్షలు జరిగాయి. సాయంత్రం సెషన్‌లో మాత్రమే ఈ పరీక్షలు జరగ్గా, 520 మందికి గానూ 457 మంది మాత్రమే హాజరయ్యారని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని డీఈవో తెలిపారు.