News March 5, 2025
వేట్లపాలెం: ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై సోమవారం వేట్లపాలెం పాఠశాలలో విచారణ నిర్వహించారు. ఈమేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Similar News
News October 17, 2025
ఎడారి నేలకు జలకళ తెచ్చిన ‘ఆమ్లా రుయా’

ఎడారికి ప్రాంతమైన రాజస్థాన్లో తాగునీటి కష్టాలు అన్నీఇన్నీ కావు. వీటికి శాశ్వత పరిష్కారం చూపాలని ఆమ్లా రుయా 1998లో ఆకర్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా 200 కుంటలు, బావులు, 317 చెక్ డ్యామ్లు నిర్మించారు. వీటితో అక్కడి పేద ప్రజలు ఆర్థికంగా బలోపేతమయ్యేలా కృషిచేసి ఆమె ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ✍️ మహిళల స్ఫూర్తిదాయక కథనాలు, చైల్డ్ కేర్ కంటెంట్ కోసం <<-se_10014>>వసుధ<<>> క్లిక్ చేయండి.
News October 17, 2025
2035 నాటికి ఇండియా స్పేస్ స్టేషన్ రెడీ: ఇస్రో

మన సొంత స్పేస్ స్టేషన్ కల 2035 నాటికి నెరవేరనుంది. దీని ఇనిషియల్ మాడ్యూల్స్ 2027 నుంచి ఇన్స్టాల్ చేస్తామని ISRO ఛైర్మన్ నారాయణన్ తెలిపారు. ’చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్తో దాని తదుపరి ప్రాజెక్టును కొనసాగిస్తున్నాం. గగన్యాన్-3 కూడా రెడీ అవుతోంది. అంతరిక్ష ప్రయోగాల్లో స్వయం సమృద్ధితో ముందుకెళ్తున్నాం. టెలికాం, వెదర్, డిజాస్టర్ ఇలా అనేకరకాల మేలు జరుగుతోంది’ అని అన్నారు.
News October 17, 2025
జూబ్లీలో నామినేషన్లు ఎక్కువైతే ఏం చేద్దామంటారు?

జూబ్లీహిల్స్ బైపోల్ సందర్భంగా అధికారులకు కొత్త కష్టాలు మొదలయ్యాయి. నామినేషన్లు పరిమిత సంఖ్యలో వస్తాయనుకుంటే వాటి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో అధిక సంఖ్యలో వస్తే ఏం చేయాలనేదానిపై అధికారులు సమాలోచనలో పడ్డారు. 407 పోలింగ్ స్టేషన్లుండగా వాటికి 569 ఈవీఎంలు, 569 కంట్రోల్ యూనిట్లు సిద్ధం చేశారు. ఉపసంహరణలు ముగిసిన తర్వాతే పరిస్థితి అర్థమవుతుంది. కాబట్టి వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారు.