News January 16, 2025
వేపాడ: ఎడ్ల పరుగు ప్రదర్శనలో అపశ్రుతి.. వ్యక్తి మృతి

వేపాడ మండలం కృష్ణరాయుడుపేటలో బుధవారం నిర్వహించిన ఎడ్ల పరుగు ప్రదర్శనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్ల పరుగు ప్రదర్శనలో ఒక బండి అదుపు తప్పి కల్లాల వైపు వెళ్లింది. బి.దేముడు(48)పైకి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఎస్ఐ దేవికి చెప్పారు. మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Similar News
News January 3, 2026
VZM: కేజీబీవీ నోటిఫికేషన్.. జిల్లాలో ఖాళీల వివరాలు

AP KGBV ఔట్సోర్సింగ్లో 1095 పోస్టులకు <
News January 3, 2026
బాలికపై అత్యాచారం.. 20 ఏళ్ల జైలు శిక్ష: VZM SP

బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడికి కోర్టు కఠిన కారాగార శిక్షను విధించినట్లు SP దామోదర్ శుక్రవారం తెలిపారు. బాడంగి (M)కి చెందిన V.వెంకటరమణ అదే ప్రాంతానికి చెందిన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో 2024 డిసెంబర్లో పోక్సో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు బాధితురాలికి పరిహారంగా రూ.5 లక్షలు మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.
News January 3, 2026
గరుడుబిల్లిలో పాఠశాలలను తనిఖీ చేసిన : DEO

బొండపల్లి మండలం గరుడబిల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదోవ తరగతి విద్యార్థులకు అమలు పరుస్తున్న 100 రోజుల ప్రణాళిక నిర్వహణ, విద్యార్థి ప్రతిభ పరిశీలన చేసి ప్రతి విద్యార్థి సైనింగ్ స్టార్గా మార్చేందుకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.


