News March 14, 2025
వేమనపల్లిలో పండగ పూట విషాదం

మంచిర్యాల జిల్లాలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేమనపల్లి మండలానికి చెందిన కంపెల రాజ్ కుమార్ (20) శుక్రవారం హోలీ ఆడిన తర్వాత స్నేహితులతో కలిసి ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు.
Similar News
News April 17, 2026
ఆదిలాబాద: విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఐటీడీఏ పీవో

విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలలో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు నిర్వహించడం జరిగిందని పీవో యువరాజ్ మర్మాట్ అన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐటీడీఏ ఆధ్వర్యంలో 16 పాఠశాలలను విద్య ప్లస్ పాఠశాలలుగా మార్చి ఎంపికైన విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. విద్యార్థులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడం జరుగుతుందన్నారు.
News April 17, 2026
ఆదిలాబాద్: మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ షురూ

ఆదిలాబాద్ మున్సిపాలిటిలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ ప్రారంభమయింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం నలుగురు సభ్యులను ఎన్నుకునేందుకు కసరత్తు మొదలైంది. ఇందులో ఇద్దరు మైనారిటీలు, ఇద్దరు ఇప్పటికే కౌన్సిలర్లుగా పని చేసిన వారిని ఎన్నుకొనగా.. రెండు విభాగాల్లో ఒక మహిళ సభ్యురాలు ఉండనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 25లోపు పూర్తి వివరాలను సమర్పించాలని కమిషనర్ రాజు తెలిపారు.
News April 17, 2026
ఆదిలాబాద్: DOST HELP LINE సెంటర్

డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో దోస్త్ హెల్ప్ లైన్ సెంటర్ను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ సంగీత తెలిపారు. ఈ నెల 15న మొదటి విడత రిజిస్ట్రేషన్లు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. జిల్లాలోని విద్యార్థులకు రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు ఎదురైతే హెల్ప్ లైన్ సెంటర్ను సంప్రదించాలన్నారు. ఆధార్, ఫోన్, ధ్రువపత్రాలతో రావాలన్నారు.


