News March 14, 2025
వేమనపల్లిలో పండగ పూట విషాదం

మంచిర్యాల జిల్లాలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వేమనపల్లి మండలానికి చెందిన కంపెల రాజ్ కుమార్ (20) శుక్రవారం హోలీ ఆడిన తర్వాత స్నేహితులతో కలిసి ప్రాణహిత నదిలో స్నానానికి వెళ్లాడు. ఈత రాకపోవడంతో నీటిలో గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు.
Similar News
News February 8, 2026
నిద్ర ఎక్కువైనా ప్రమాదమే!

* ఎక్కువ సమయం నిద్రపోతే బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి.
* ఇన్సులిన్ను నియంత్రించే హార్మోన్లపై ప్రభావం పడుతుంది.
* మహిళల్లో సంతానోత్పత్తి సమస్య వచ్చే ప్రమాదం ఉంది.
* కండరాలు, నరాలు సంకోచించి శారీరకంగా అలసిపోతారు.
* తలనొప్పి, వెన్నునొప్పి వస్తాయి. డిప్రెషన్కు గురవుతారు.
* అలసట, నీరసంగా అనిపించి జంక్ఫుడ్/అధిక కేలరీలున్న ఫుడ్ తినడంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది.
News February 8, 2026
మహా కుంభమేళాగా గోదావరి నది పుష్కరాలు: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో 2027లో గోదావరి పుష్కరాలను మరో దక్షిణాది కుంభమేళగా నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రగతి బాట సభలో మాట్లాడారు. సరస్వతి పుష్కరాలు సమ్మక్క, సారక్క జాతరను ఘనంగా నిర్వహించామన్నారు. బాసర నుంచి ఖమ్మం వరకు గోదావరి తీరాన్ని పర్యటక రంగంగా అభివృద్ధి చేసి వేల కోట్లు ఖర్చయినా వెనుకాడకుండా గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తామని సీఎం ప్రకటించారు.
News February 8, 2026
భూపాలపల్లి: మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై భూపాలపల్లి సహా పలు జిల్లాల కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ పాల్గొన్నారు. పోలింగ్ ఏర్పాట్లు, భద్రత, ఎంసీసీ అమలుపై పటిష్ఠ పర్యవేక్షణ ఉండాలని సూచించారు. 9వ తేదీ సాయంత్రం 5 తర్వాత సైలెన్స్ పీరియడ్ అమలు కఠినంగా చూడాలని ఆదేశించారు.


