News June 6, 2024
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి.?

నెల్లూరు TDP ఎంపీగా భారీ మెజార్టీ (2,45,902)తో గెలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి కేంద్ర కేబినెట్లో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ప్రముఖ వ్యాపారవేత్తగా ఉన్న వేమిరెడ్డి కేంద్ర మంత్రి అయితే, రాష్ట్రానికి కంపెనీలు తీసుకుని వస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ అన్నీ స్థానాలు గెలవడానికి కూడా ఆయన కృషి ఉంది.
Similar News
News October 27, 2025
రేపు జూనియర్ కళాశాలలకు సెలవు: నెల్లూరు RIO

నెల్లూరు జిల్లాలో మంగళవారం అన్ని జూనియర్ కళాశాలకు సెలవు ప్రకటించినట్లు RIO వరప్రసాద్ రావు తెలిపారు. ‘మెంథా తుఫాన్’ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు సెలవు ప్రకటించామన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. కాగా ఇప్పటికే స్కూళ్లు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.
News October 27, 2025
లోతట్టు ప్రాంతాల్లో కూరగాయల పంపిణీ

మొంథా తుఫాను నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా 15 మొబైల్ వాహనాల ద్వారా కూరగాయలను విక్రయించే ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. జిల్లా మార్కెటింగ్శాఖ ఆధ్వర్యంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలకు ఈ మొబైల్ వాహనాలను పంపి ప్రజలకు నాణ్యమైన కూరగాయలను తక్కువ ధరకు అందించేలా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ చెప్పారు.
News October 27, 2025
కందుకూరును ప్రకాశం జిల్లాలో కలపాలి: JAC

కందుకూరు జేఏసీ నేతలు సోమవారం కలెక్టర్ హిమాన్షు శుక్లాకు వినతిపత్రం అందజేశారు. కందుకూరు ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకు కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలో కలపాలని వారు కోరారు. ఇందుకు నెల్లూరు నేతల అడ్డగింత సరికాదని విమర్శించారు. ప్రజల సెంటిమెంట్కు అనుగుణంగా ప్రభుత్వం త్వరలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని కలెక్టర్ తెలిపారు.


