News January 10, 2025
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రూ. 10 లక్షల సాయం
తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు టీటీడీ బోర్డు సభ్యులు వ్యక్తిగతంగా ఆర్థికసాయం చేశారు. కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రూ. 10లక్షలు ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా సుచిత్ర ఎల్ల రూ.10 లక్షలు, ఎంఎస్ రాజు రూ.3 లక్షలు తమ వంతు సాయం చేశారు.
Similar News
News January 22, 2025
మలేషియా జైలులో నెల్లూరు జిల్లా యువకులు
తిరుపతిలోని ట్రావెల్ ఏజెంట్ల మోసంతో ఇద్దరు యువకులు మలేషియా జైల్లో ఉన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం తెగచర్లకు చెందిన పవన్, సింహాద్రి అనే యువకులను టూరిస్ట్ వీరస్వామి మాయమాటలతో వర్కింగ్ పర్మిట్ మీద మలేషియా పంపాడు. వీరిద్దరూ అక్కడి హోటల్లో పనిచేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మూడు నెలల నుంచి ఆచూకీ లేదని తమ బిడ్డలను ఎలాగైనా స్వదేశానికి రప్పించాలని బాధితుల తల్లిదండ్రులు కోరారు.
News January 22, 2025
కలెక్టర్ సమక్షంలో విద్యాశాఖ పునర్విభజన సన్నాహక సమావేశం
పాఠశాలల పునర్విభజన బోధన సిబ్బంది పునర్నిర్మాణం సన్నాహక సమావేశం నెల్లూరు నగరంలోని జిల్లా కలెక్టరేట్ తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ సమక్షంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మెమోను తూచా తప్పకుండా పాటించాలని, గ్రామస్థుల సూచనలు, వారిని సమన్వయం చేయాలని తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ బాలాజీ రావు కొన్ని సూచనలు, మార్పులను ప్రతిపాదించారు.
News January 21, 2025
బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఇతనే
బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా సీపాన వంశీధర్ రెడ్డి మళ్లీ ఎన్నికయ్యారు. రాష్ట్ర, కేంద్ర నాయకత్వం వంశీధర్ రెడ్డిని ఎంపిక చేసిందని రాష్ట్ర పరిశీలకులు ప్రకటించారు. ఈ సందర్భంగా తిరిగి వంశీధర్ రెడ్డి ఎన్నిక పట్ల బీజేపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.