News March 21, 2025

వేములవాడలో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీచైతన్య పాఠశాలలో పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్‌ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా విద్యార్థులు రాస్తున్న తీరును పరిశీలించి, పరీక్ష కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 26, 2025

iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

image

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్‌పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.

News November 26, 2025

స్టేట్ ఛాంపియన్స్‌గా ఉమ్మడి కృష్ణా జిల్లా జట్టు

image

మదనపల్లి హైస్కూల్‌లో నవంబర్ 24, 25, 26 తేదీలలో నిర్వహించిన 69వ రాష్ట్రస్థాయి SGFI అండర్-14 బాస్కెట్‌బాల్ టోర్నమెంట్‌లో ఉమ్మడి కృష్ణా జిల్లా బాలికల జట్టు రాష్ట్ర ఛాంపియన్‌గా నిలిచింది. బుధవారం నూజివీడులో సీనియర్ పీడీ వాకా నాగరాజు ఈ విషయాన్ని వెల్లడించారు. బాలుర జట్టు నాలుగో స్థానంతో సరిపెట్టుకుందని తెలిపారు. విజేతలైన బాలబాలికలను ఆయన అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో కూడా విజయం సాధించాలన్నారు.

News November 26, 2025

సిరిసిల్ల: ‘అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దాం’

image

అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిద్దామని బెటాలియన్ అసిస్టెంట్ కమాండెడ్ రామదాసు అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పరిధిలోని సర్దాపూర్ బెటాలియన్ లో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా రామదాసు మాట్లాడుతూ.. మన దేశ రాజ్యాంగానికి నేటి రోజున ఆమోద ముద్ర పడిందన్నారు. రాజ్యాంగం రచించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టిందని గుర్తు చేశారు.