News April 9, 2025
వేములవాడలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

వేములవాడ పరిధిలోని బాలనగర్, వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి, మల్లారం గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్, తదితరులు ఉన్నారు.
Similar News
News November 27, 2025
జగిత్యాల: లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కలెక్టర్కు వినతి

కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 4 లేబర్ కోడ్స్ను రద్దుచేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక జిల్లా జేఏసీ నాయకులు బుధవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమం, పని పరిస్థితుల పేరుతో ఆమోదించిన ఈ కోడ్స్ వల్ల కార్మికుల కుటుంబాలకు జీవనప్రమాణాలు దెబ్బతింటాయని వారు ఆందోళన వ్యక్తంచేశారు. కార్మికులకు అనుకూలమైన 44 కార్మికచట్టాలను అమలుచేయాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను వారు కోరారు.
News November 27, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> జనగామ: పత్తి అమ్మకంలో రైతుల ఇక్కట్లు
> బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద నిరసన
> ఎన్నికల నిబంధనలపై అందరికీ ఆవాహన ఉండాలి
> జనగామ: బీఆర్ఎస్ సమావేశానికి కేటీఆర్ హాజరు
> స్టేషన్ ఘనపూర్లో తొలగించని ఫ్లెక్సీలు
> నర్మెట్ట: కొమురవెల్లి దేవస్థానం ఛైర్మన్గా గంగం నరసింహ రెడ్డి
> పంచాయతీ ఎన్నికలకు పకడ్బంది ఏర్పాట్లు చేయాలి: ఎన్నికల కమిషనర్
News November 27, 2025
హైడ్రాపై కర్ణాటక బృందం ప్రశంసలు

TG: హైడ్రా (HYDRAA) చేపట్టిన చెరువుల పునరుద్ధరణ పనులను పరిశీలించిన కర్ణాటక ప్రతినిధులు ఈ మోడల్ను బెంగళూరుతో పాటు ఇతర మెట్రో నగరాలకు ఆదర్శంగా పేర్కొన్నారు. బతుకమ్మకుంట, నల్లచెరువు వంటి పునరుద్ధరించిన చెరువులను పరిశీలించారు. ఆక్రమణల తొలగింపు, పునరుద్ధరణలో హైడ్రా చేపట్టిన చర్యలను ప్రశంసించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్తో జరిగిన చర్చలో దీని అమలు విధానం, విభాగాల సమన్వయం గురించి తెలుసుకున్నారు.


