News December 8, 2024
వేములవాడ కోడెల విక్రయం అవాస్తవం: మంత్రి కొండా సురేఖ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కోడెలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే రీతిలో కుట్రపూరితంగా ప్రసారమవుతున్న తప్పుడు వార్తలను ఆమె ఖండించారు. ప్రభుత్వం హిందువుల మనోభావాలు దెబ్బతీస్తుందని అవాస్తవాలు ప్రచారం చేస్తూ సమాజంలో అశాంతిని సృష్టించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.
Similar News
News January 14, 2025
పెద్దపల్లి: హాస్టల్కు వెళ్లమన్నందుకు ఉరేసుకున్నాడు
మనస్తాపంతో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసుల వివరాలు.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్(M) కూనారం వాసి ప్రసన్నకుమార్ HNKలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. సెలవులకు ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో తాను హాస్టల్కు వెళ్లనని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు మందలించగా సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News January 14, 2025
KNR: మీ ముచ్చటైన ముగ్గులు Way2Newsలో
సంక్రాంతి, కనుమ సందర్భంగా మీ వాకిట్లో వేసిన మీ ముగ్గులనూ Way2Newsలో చూడాలనుకుంటే 7331149141 నంబర్కు వాట్సాప్ చేయండి. నోట్: ఫొటో, మీ పేరు, గ్రామం, మండలం, జిల్లా పేర్లు కచ్చితంగా పంపగలరు. పండుగను ప్రతిబింబించే ముగ్గులు మాత్రమే (వాట్సాప్ పోస్టు) పబ్లిష్ అవుతాయి.
News January 13, 2025
సిరిసిల్ల: జగన్నాథం పార్థివదేహాన్ని సందర్శించిన కేటీఆర్
అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎంపీ, సీనియర్ రాజకీయ నాయకులు మంద జగన్నాథం పార్థివదేహాన్ని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. జగన్నాథం ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. ఆయనతో పాటు బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.