News February 3, 2025

వేములవాడ: నేడు అఘోరి వస్తుందా..? రాదా..?

image

గతంలో అఘోరి చేసిన వ్యాఖ్యలతో నేడు ఏం జరగనుందో అని అంతటా చర్చ జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న లేడీ అఘోరి ఫిబ్రవరి 3న వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చి ఆలయంలోని దర్గాను కూల్చివేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి వేములవాడ వైపు మళ్లింది. అఘోరి చెప్పినట్లుగా నేడు నిజంగా ఆమె వేములవాడకు వస్తుందా..? రాదా..? అనేది  మరికొద్దిసేపట్లో తెలవనుంది.

Similar News

News February 3, 2025

అభిషేక్ ఊచకోతకు బౌలర్లు చేతగానివాళ్లలా కనిపించారు: పీటర్సన్

image

నిన్నటి మ్యాచ్‌లో అభిషేక్ సెంచరీతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఆ ఇన్నింగ్స్‌పై ఇంగ్లండ్ మాజీ బ్యాటర్ కెవిన్ పీటర్సన్ ప్రశంసలు కురిపించారు. ‘పిచ్ బ్యాటింగ్‌కు బాగుంది కరెక్టే. కానీ అటువైపు ఇంగ్లండ్ బౌలర్లేం తక్కువవారు కాదు. అలాంటి ఆటగాళ్లు కూడా అతడి విధ్వంసాన్ని చేతగానివాళ్లలా చేష్టలుడిగి చూస్తుండిపోయారు. ఇక వరుణ్ చక్రవర్తి సైతం అద్భుతమైన బౌలింగ్ వేశారు. అతడిని ఆడటం చాలా కష్టం’ అని పేర్కొన్నారు.

News February 3, 2025

EAPCET షెడ్యూల్ ఖరారు

image

తెలంగాణ EAPCET షెడ్యూల్ ఖరారైంది. మే 2 నుంచి 5 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష, ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు నిర్వహించనుంది. ఈ నెల 20న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా, ఫిబ్రవరి 25 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈసారి EAPCETను JNTUH నిర్వహిస్తోంది.

News February 3, 2025

NRPT: పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలి

image

నులి పురుగులు నివారణకు పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో ఈనెల 10న జరిగే జాతీయ నులి పురుగుల దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో ఒక సంవత్సరం వయస్సు నుంచి 19 ఏళ్ల లోపు పిల్లల్లో నులి పురుగుల నివారణకు మాత్రలు పంపిణీ చేయాలన్నారు.