News January 27, 2025
వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో అరుదైన చికిత్స

వేములవాడ ఏరియా ఆసుపత్రిలో రాళ్ళపేట గ్రామానికి చెందిన 53ఏళ్ల మహిళకి ఫిల్లోడ్స్ టూమర్ అనే రొమ్ములో గడ్డని ప్రత్యేక అరుదుగా ఇచ్చే మత్తు ద్వారా వైద్య బృందం తొలగించారు. మత్తు వైద్య బృందం డా. పెరికె తిరుపతి, డా.రవీందర్, డా.రాజశ్రీ, డా.ప్రియాంక, డా. సిద్దార్థ్, ఇతర సహాయక సిబ్బంది కలిసి రీజినల్ తొరసిక్ ఎపిడ్యూరల్ అనే పద్ధతిలో తొలగించారు. సీనియర్ సర్జన్ డా.పెంచలయ్య నేతృత్వంలో వైద్యులు చేసినట్లు తెలిపారు.
Similar News
News February 14, 2025
వల్లభనేని వంశీకి 14 రోజుల రిమాండ్

AP: గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాసేపట్లో ఆయనను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించనున్నారు. నిన్న ఉదయం ఆయనను అరెస్ట్ చేసిన పోలీసులు 8 గంటల పాటు విచారించారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి జడ్జి ముందు హాజరుపరిచారు. దాదాపు 2 గంటలపాటు వాదనలు జరిగాయి. A1 వంశీతో పాటు A7 శివరామకృష్ణ, A8 లక్ష్మీపతికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.
News February 14, 2025
జగిత్యాల: ఇద్దరు మహిళలు ARREST

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊటుపల్లి గ్రామంలో గజేల్లి లక్ష్మి అనే వృద్ధురాలి మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్లిన కేసులో ఇద్దరు మహిళలను అరెస్టు చేసినట్లు కోరుట్ల సీఐ సురేశ్ బాబు గురువారం తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన మౌనిక, రాయికల్లో నివాసం ఉంటున్న రాజేశ్వరి ఈ దొంగతనానికి పాల్పడినట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు వారిని అరెస్టు చేశారు.
News February 14, 2025
దుబాయ్లో సిరిసిల్ల యువకుడు MISSING

దుబాయ్ దేశంలో సిరిసిల్ల జిల్లాకు చెందిన యువకుడు అదృశ్యమైనట్లు కుటుంబీకులు తెలిపారు. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన జెల్లబాల శంకర్(30) ఈనెల 6వ తారీఖున బ్రతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లాడు. మరుసటి రోజు సోనాపూర్ క్యాంపు నుంచి బయటకు వెళ్లి ఇంతవరకు తిరిగి రాలేదు. తోటి మిత్రులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు.