News February 25, 2025
వేములవాడ: మూలవాగులో గుర్తుతెలియని శవం

వేములవాడలోని మూల వాగులో సోమవారం గుర్తు తెలియని శవం లభ్యమైందని సీఐ వీరప్రసాద్ తెలిపారు. చనిపోయిన వ్యక్తి సుమారు 35 నుంచి 40 సంవత్సరాల వయసు కలిగి ఉంటాడని అంచనా వేశారు. ఎవరికైనా అతని గురించి వివరాలు తెలిస్తే డయల్100, 8712656413, 8712580413 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.
Similar News
News January 5, 2026
గొర్రెల పెంపకం – సాంద్ర పద్ధతి అంటే ఏంటి?

సాంద్ర పద్ధతిలో గొర్రెలు ఎప్పుడూ పాకల్లోనే ఉంటాయి. వీటికి నిర్ణీత మోతాదులో పచ్చిగడ్డి, దాణాను ఏర్పాటు చేయాలి. పరిశుభ్రమైన నీటిని అందుబాటులో ఉంచాలి. జీవాల లెక్కింపు, మందులు, టీకాలు వేయడం ఈ విధానంలో సులభంగా ఉంటుంది. పశుగ్రాసం వృథాకాదు. అయితే పాకలను పరిశుభ్రంగా ఉంచాలి. షెడ్లలోనికి గాలి వెలుతురు సరిగా ప్రసరించేలా చూడాలి. పచ్చి పశుగ్రాసాలను చాఫ్ కట్టర్తో చిన్న ముక్కలుగా చేసి దాణా తొట్లలో అందించాలి.
News January 5, 2026
మక్తల్: అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, కెమిస్ట్రీలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఈ నారాయణ గౌడ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీలో 55% మార్కులతో పాసై ఉండాలని అలాగే నెట్, సెట్, పీహెచ్డీ ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 7వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 8వ తేదీన ఎంపిక పరీక్ష ఉంటుందన్నారు.
News January 5, 2026
రాశీకి క్షమాపణలు చెప్పిన అనసూయ

సీనియర్ హీరోయిన్ <<18762425>>రాశీకి<<>> నటి అనసూయ క్షమాపణలు చెప్పారు. మూడేళ్ల క్రితం ఓ షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్లో తనతో డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించారని Xలో పోస్ట్ చేశారు. ఆ వ్యాఖ్యలు రాయించి, డైరెక్ట్ చేసిన వ్యక్తిని ఆ రోజునే నిలదీయాల్సి ఉండగా ఆ టైమ్కి తన శక్తి సరిపోలేదన్నారు. మనుషులు మారుతారని, ఆ షో విడిచి పెట్టాక తనలో మార్పును గమనించాలని కోరారు. గతంతో పోలిస్తే తాను శక్తిమంతంగా మారానన్నారు.


