News February 24, 2025
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారిని సోమవారం భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. దీంతో ఆలయం భక్తులతో కోలాహలంగా మారి దర్శనమిస్తుంది. దర్శనంలో భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకుని స్వామివారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి జాతరకు ముందు వచ్చే సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నట్లు తెలుస్తుంది.
Similar News
News July 11, 2025
కృష్ణా: క్రియాశీలక రాజకీయాలకు నాని, వంశీ రెడీ

ఎన్నికల అనంతరం రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ MLAలు కొడాలి నాని, వల్లభనేని వంశీ తిరిగి రాజకీయంగా చురుగ్గా మారేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల్లో YCP ఓటమి, వంశీ అరెస్ట్, నాని ఆరోగ్య సమస్యలు వంటి పరిణామాల నేపథ్యంలో ఈ ఇద్దరూ ప్రజల కంటపడకుండా ఉన్నారు. నాని కొన్ని సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చినప్పటికీ, వంశీ పూర్తిగా మౌనంగా ఉన్నారు. గుడివాడలో జరగనున్న YCP సమావేశంతో వీరు రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నారు.
News July 11, 2025
VJA: మరికొద్ది గంటలలో ముగియనున్న గడువు

అమరావతిలోని ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్(APDDCF)లో కాంట్రాక్ట్ పద్ధతిన 9 మేనేజర్ ఉద్యోగాల భర్తీకై నోటిఫికేషన్ విడుదలైంది. డైయిరీ టెక్నాలజీలో బీటెక్ చదివిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులని APDDCF అధికారులు తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://apddcf.ap.gov.inలో జులై 11వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి రూ.30 వేల వేతనం ఇస్తామన్నారు.
News July 11, 2025
వికారాబాద్కు పరిశ్రమలు క్యూ కడతాయి: మహేశ్వర్

జిల్లాలో 2024 -25లో 106 పరిశ్రమల యూనిట్లకు అనుమతులు ఇచ్చామని వికారాబాద్ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి మహేశ్వర్ తెలిపారు. జిల్లాలో పనరులు, వాతావరణం పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉండటంతో పరిశ్రమలు క్యూ కడతాయని వివరించారు. ఇప్పటికే కొడంగల్ ఆర్కతల, ఎన్కతల గ్రామాల సమీపంలో పారిశ్రామిక వాడలు వెలిశాయన్నారు. గతేడాది 106 పరిశ్రమల యూనిట్లకు అనుమతులు ఇవ్వగా వందల మందికి ఎంప్లాయ్మెంట్ లభిస్తుందని స్పష్టం చేశారు.