News December 30, 2024
వేములవాడ: రాజన్న ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అమావాస్య కారణంగా భక్తుల రద్దీ తక్కువైంది. నిత్యం వేలాది మందిగా వచ్చి ఆలయ ధర్మగుండంలో స్థానమాచరించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సారి అమావాస్య సోమవారం కారణంగా బోసిపోయింది. జనం ఎక్కువగా లేకపోవడంతో ఆలయ సిబ్బంది, అర్చకులు ఖాళీగా కనిపించారు.
Similar News
News December 9, 2025
కరీంనగర్ ఆర్టీసీ వన్ డే టూర్ ప్యాకేజీ

ఆర్టీసీ కరీంనగర్-1 డిపో ప్రత్యేక వన్ డే టూర్ ప్యాకేజీని ఏర్పాటు చేసినట్లు డి.ఎం. విజయమాధురి తెలిపారు. ఈ ప్యాకేజీలో బీదర్ జలా నరసింహస్వామి, బీదర్ పోర్టు, జరాసంగం, రేజింతల్ సందర్శన ఉంటుంది. ఈ నెల 14న ఉదయం 3:30 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి కరీంనగర్కు చేరుకుంటుంది. టికెట్ ధర పెద్దలకు రూ.1,400, పిల్లలకు రూ.1,080గా నిర్ణయించారు. ఆసక్తి గలవారు డిపోలో సంప్రదించాలని సూచించారు.
News December 9, 2025
మెదటి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది: కలెక్టర్

గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికలకు 9వ తేది సా. 5 గంటల నుంచి ప్రచారానికి తెరపడనున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. పోలింగ్కు 44 గంటల ముందు నుంచి ఆయా మండలాలు, గ్రామాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ఉల్లంఘనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 9, 2025
KNR: పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని ఆదేశించారు. కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడారు. మెదడి విడతలో 5 మండలాలు గంగాధర, చొప్పదండి, రామడుగు, కొత్తపల్లి, కరీంనగర్ రూరల్లో ఎన్నికలు జరగనున్నాయన్నారు. మొత్తం 92 పంచాయతీలకు గాను మొత్తం 866 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


