News May 2, 2024

వేములవాడ రాజన్న హుండీ లెక్కింపు

image

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి హుండీ లెక్కింపును గురువారం ఆలయ ఓపెన్ స్లాబ్‌లో నిర్వహించారు. గడిచిన 21రోజులకు గాను స్వామివారికి రూ.1కోటి 52లక్షల 15 వేల 575 నగదుతో పాటు 218 గ్రాముల బంగారం, 11కిలోల 500గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ EO కృష్ణప్రసాద్, కరీంనగర్ AC కార్యాలయం పరిశీలకులు సత్యనారాయణ, AEO హరికిషన్ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News December 6, 2025

గ్రామపంచాయతీ ఎన్నికల భద్రతపై సీపీ గౌష్ ఆలం సమీక్ష

image

గ్రామ పంచాయతీ ఎన్నికల భద్రత ఏర్పాట్లపై కరీంనగర్ సీపీ గౌష్ ఆలం శనివారం కమిషనరేట్‌లో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ స్పష్టం చేశారు. రౌడీ షీటర్ల బైండోవర్‌ను పూర్తి చేసి, వారిపై నిరంతర నిఘా ఉంచినట్లు తెలిపారు.

News December 6, 2025

రక్త సంబంధీకుల నుంచి బాబు దత్తత

image

జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, మిషన్ వాత్సల్య ఆధ్వర్యం పిల్లలు లేని దంపతులు తమ రక్త సంబంధీకుల నుంచి 12 నెలల బాబును చట్టపరంగా దత్తత తీసుకున్నారు. ఈ దత్తత ఉత్తర్వులను శనివారం జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి దంపతులకు అందజేశారు. దత్తత ప్రక్రియ తప్పనిసరిగా చట్టబద్ధంగా ఉండాలని, దీని కోసం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

News December 6, 2025

రక్త సంబంధీకుల నుంచి బాబు దత్తత

image

జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, మిషన్ వాత్సల్య ఆధ్వర్యం పిల్లలు లేని దంపతులు తమ రక్త సంబంధీకుల నుంచి 12 నెలల బాబును చట్టపరంగా దత్తత తీసుకున్నారు. ఈ దత్తత ఉత్తర్వులను శనివారం జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి దంపతులకు అందజేశారు. దత్తత ప్రక్రియ తప్పనిసరిగా చట్టబద్ధంగా ఉండాలని, దీని కోసం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.