News January 31, 2025
వేములవాడ: ‘విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించాలి’

విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, కౌన్సెలింగ్ పై జిల్లాలోని టీచర్లకు వేములవాడలోని ఉన్నత పాఠశాలలో 2 రోజుల శిక్షణ ఇచ్చారు. దీనికి హాజరైన సైకాలజిస్ట్ పున్నంచందర్, విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించే మెలకువలు తెలిపారు. టీనేజ్ లో విద్యార్థులు ఎదుర్కొనే శారీరక, మానసిక, నైతిక సమస్యల పట్ల అవగాహన కల్పించి భవిష్యత్ కోసం సరైన మార్గదర్శకం చేయాలన్నారు. ఒత్తిడి లేని, విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు.
Similar News
News September 15, 2025
విశాఖలో ఆరుగురు ఇన్స్పెక్టర్లకు బదిలీ

విశాఖ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆరుగురు ఇన్స్పెక్టర్లకు బదిలీ చేస్తూ సీపీ శంఖబ్రత బాగ్చి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎంవీపీ సీఐ మురళి, వెస్ట్ జోన్ క్రైమ్ సీఐ శ్రీనివాసరావులను విశాఖ రేంజ్కు సరెండర్ చేశారు. ఎంవీపీ లా అండ్ ఆర్డర్ సీఐగా ప్రసాద్, వెస్ట్ జోన్ క్రైమ్కు చంద్రమౌళి, ద్వారకా ట్రాఫిక్కు ప్రభాకరరావు, పోలీస్ కంట్రోల్ రూమ్కు సిటీ వీఆర్లో ఉన్న భాస్కరరావును నియమించారు.
News September 15, 2025
మహిళల ఆరోగ్యంపై శిబిరాలు: DMHO

‘స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్’ పేరిట జిల్లా వ్యాప్తంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నట్టు డీఎంహెచ్ఓ డా. విజయలక్ష్మి తెలిపారు. ఈ శిబిరాలలో మహిళలకు గుండె జబ్బులు, మధుమేహం, గర్భాశయ క్యాన్సర్, రక్తహీనత వంటి వ్యాధులను గుర్తించి, చికిత్సలు అందిస్తారు. గర్భిణులకు పరీక్షలు, పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, రక్తదాన శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు.
News September 15, 2025
SDPT: ‘స్వచ్ఛత హి సేవా’ పోస్టర్ ఆవిష్కరణ

‘స్వచ్ఛత హి సేవా-2025’ కార్యక్రమం ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాల్లో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిద్దిపేట కలెక్టర్ హైమావతి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. గ్రామాల్లోని ప్రజల సహకారంతో శ్రమదానం, వ్యర్థాల తొలగింపు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈఓతో పాటు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.