News April 14, 2025

వేములవాడ: వ్యక్తి దారుణ హత్య

image

వేములవాడలోని ఓ ఫంక్షనల్ వద్ద ఆదివారం సాయంత్రం వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పరశురాం (39)ను గుర్తుతెలియని వ్యక్తులు హతమర్చారు. మృతుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 8, 2025

VJA: ప్రేమ పేరుతో మోసం

image

చిలకలపూడికి చెందిన మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసిన అదే గ్రామానికి చెందిన బాలుడు, అతడికి సహకరించిన స్నేహితుడు, స్నేహితుడి కుటుంబ సభ్యులకు విజయవాడ పోక్సో కోర్టు శుక్రవారం రిమాండ్ విధించింది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విద్యాసాగర్ స్పందిస్తూ, బాలికలను ప్రేమ పేరుతో వేధించే వారిని సహించేది లేదని హెచ్చరించారు.

News November 8, 2025

నరసన్నపేట: పంచలోహ విగ్రహాల అప్పగింత

image

నరసన్నపేటలోని సిద్ధాశ్రమంలో ఏడు పంచలోహ విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ శ్రీనివాసరావు, ఎస్సై దుర్గాప్రసాద్ నిందితుడి వద్ద సమాచారం రాబట్టి, విగ్రహాలను సిద్ధాశ్రమ నిర్వాహకులకు శుక్రవారం రాత్రి అందజేశారు.

News November 8, 2025

సూర్యాపేట డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా వేణుగోపాల్

image

సూర్యాపేట డిప్యూటీ డీఎంహెచ్‌ఓగా డాక్టర్ వేణుగోపాల్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన హుజూర్‌నగర్ మండలం లింగగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఇంతకు ముందు ఈ పదవిలో ఉన్న జయ మనోహరి పదోన్నతిపై వెళ్లడంతో, ఆ స్థానంలో డా.వేణుగోపాల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నియామకం పట్ల వైద్యులు, పారామెడికల్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.