News April 14, 2025
వేములవాడ: వ్యక్తి దారుణ హత్య

వేములవాడలోని ఓ ఫంక్షనల్ వద్ద ఆదివారం సాయంత్రం వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పరశురాం (39)ను గుర్తుతెలియని వ్యక్తులు హతమర్చారు. మృతుడు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 12, 2026
తాళ్లరేవు: పోలీసుల్ని చూసి భయం.. యాక్సిడెంట్.. బీటెక్ విద్యార్థిని మృతి

తాళ్ళరేవు సుంకరపాలెం జంక్షన్ సమీపంలోని ఎక్సైజ్ చెక్పోస్ట్ మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యానాంకు చెందిన పైడా కాలేజీ బీటెక్ విద్యార్థిని మహమ్మద్ మోమిన్ (22) మృతి చెందింది. హాల్ టికెట్ తీసుకుని స్కూటీపై ఇంటికొస్తున్న సమయంలో పోలీసుల్ని చూసి భయపడి అతి వేగంతో వెళ్తూ బస్సుని ఢీకొట్టారు. ప్రమాదంలో మోమిన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమెతో ఉన్న మరో యువతి గాయాలతో బయటపడ్డారు. కేసు నమోదైంది.
News February 12, 2026
ALERT: ఈ లింక్స్ క్లిక్ చేయకండి!

వాలంటైన్స్ వీక్ పేరుతో వచ్చే మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ‘సర్ప్రైజ్ గిఫ్ట్’ వంటి లింక్లను క్లిక్ చేస్తే బ్యాంక్ అకౌంట్ ఖాళీ అవుతుందని తెలిపారు. తెలియని నంబర్ల నుంచి లేదా గ్రూపుల్లో వచ్చే లింక్స్ను నమ్మి వ్యక్తిగత వివరాలు షేర్ చేయవద్దని సూచించారు. ఒకవేళ మోసపోతే ‘గోల్డెన్ అవర్’లో 1930 నంబర్కు కాల్ చేయాలని లేదా cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని కోరారు.
News February 12, 2026
నార్త్ కొరియా తదుపరి లీడర్గా కిమ్ జు ఏ?

ఉత్తర కొరియా తదుపరి లీడర్గా కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె ‘కిమ్ జు ఏ’ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సౌత్ కొరియా నిఘా సంస్థ వెల్లడించింది. ఆమెను తన వారసురాలిగా ప్రకటించేందుకు కిమ్ సిద్ధమవుతున్నట్లు పేర్కొంది. ఇటీవల ఆమె కీలక సైనిక పర్యటనల్లో పాల్గొనడం, విధాన నిర్ణయాల్లో ఆమె అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వడం దీనికి బలం చేకూరుస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.


