News March 15, 2025

వేమూరులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం వేమూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కఠివరంకు చెందిన బత్తి శ్రీధర్(28) గుంటూరుకు చెందిన తోట సోము కుమార్ లు కొల్లూరు నుంచి ద్విచక్ర వాహనంపై తెనాలి వెళుతుండగా ఎదురుగా వస్తున్న టాటా ఏసీని ఢీకొట్టారు. శ్రీధర్ అక్కడికక్కడే మృతచెందగా సోము కుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవికృష్ణ తెలిపారు.

Similar News

News February 26, 2026

MHBD: క్రీడా పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

image

క్రీడా పాఠశాలల్లో నాలుగో తరగతి ప్రవేశాలకు ఎంపికలు నిర్వహించనున్నట్లు MHBD జిల్లా క్రీడల అధికారి జ్యోతి తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 26 నుంచి మార్చి 4వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మండల స్థాయి ఎంపికలు మార్చి 13 నుంచి 17 వరకు ఎంఈఓల పర్యవేక్షణలో జరుగుతాయని, అక్కడ ప్రతిభ చాటిన వారికి మార్చి 28న జిల్లా కేంద్రంలోని NTR స్టేడియంలో తుది ఎంపికలు నిర్వహిస్తామన్నారు.

News February 26, 2026

పదేళ్లలో ఒక్క గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వలేదు: CM రేవంత్

image

TG: గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క గ్రూప్-1 ఉద్యోగం కూడా ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక TGPSCని ప్రక్షాళన చేశామన్నారు. ప్రశ్నపత్రాలను జిరాక్స్ సెంటర్లలో అమ్మకుండా కఠిన చర్యలు చేపట్టామని గ్రూప్-1,2 ఆఫీసర్ల ట్రైనింగ్ ముగింపు కార్యక్రమంలో చెప్పారు. శిక్షణ పూర్తి చేసుకున్నవారంతా ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రజలకు సేవ చేయాలని సూచించారు.

News February 26, 2026

ఒక్కటైన సూర్యాపేట అబ్బాయి.. జపాన్ అమ్మాయి

image

ఖండాంతరాలు దాటిన ప్రేమ పెళ్లి పీటలెక్కింది. మేళ్లచెరువుకు చెందిన వరగాని రాజేశ్ సాఫ్ట్‌వేర్ ఉద్యోగ రీత్యా జపాన్ వెళ్లి, అక్కడ టోక్యోకు చెందిన వకానాతో ప్రేమలో పడ్డాడు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో బుధవారం ఖమ్మంలో వీరు హిందూ సంప్రదాయ పద్ధతిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. విదేశీ వధువు మన సంస్కృతిలో మెరిసిపోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకను చూసేందుకు స్థానికులు ఎంతో ఆసక్తి చూపారు.