News March 4, 2025

వేమూరు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన బలిజేపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. మంగళవారం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బలిజేపల్లి గ్రామానికి చెందిన రైతు వేజెండ్ల పూర్ణచంద్రరావు(70) పొలంలో మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి వెళ్లాడు. కాగా మంగళవారం మోటార్ పంపు షెడ్డు వద్ద మృతి చెంది ఉండడం గమనించారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేమూరు ఎస్ఐ రవి కృష్ణ కేసు నమోదు చేశారు.

Similar News

News October 24, 2025

బస్ ఎక్కకుండా ప్రాణాలు దక్కించుకున్నాడు

image

కర్నూలు ఘోర బస్సు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే బస్సులో TGకి చెందిన 15 మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. వీరిలో తరుణ్ అనే యువకుడు మాత్రం చివరి నిమిషంలో ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఆయన సీట్ నంబర్ U-2లో టికెట్ బుక్ చేసుకున్నారు. HYD ప్యారడైజ్ వద్ద బోర్డింగ్ చేయాల్సి ఉండగా బస్ ఎక్కకుండా ప్రమాదం నుంచి సురక్షితంగా బయపడ్డారు. మిగతా 14 మందిలో 8 మంది మరణించారు.

News October 24, 2025

FLASH: సిద్దిపేట జిల్లాలో యాక్సిడెంట్

image

ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బైక్ ఢీకొని యువకుడు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. చిన్నకోడూరు మండలం ఇబ్రహీంనగర్ గ్రామానికి చెందిన యువకుడు(29) బైక్‌పై వస్తున్నాడు. బెజ్జంకి క్రాసింగ్ దగ్గర రాజీవ్ రహదారిపైకి రాగానే హైదరాబాద్ వైపు రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వెనకాల నుంచి వేగంగా ఢీకొట్టి చనిపోయాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 24, 2025

పెద్దపల్లి: పాము కాటుతో డిగ్రీ విద్యార్థిని మృతి

image

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో విషాదం నెలకొంది. రూపునారాయణపేట గ్రామానికి చెందిన డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న గుర్రం అక్షిత(18) దీపావళి సెలవులకు ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో ఇంట్లో ఉండగా దురదృష్టవశాత్తు ఆమెను పాము కుట్టింది. స్పందించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా కరీంనగర్ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.