News March 1, 2025

వేర్వేరు ఘటనల్లో ముగ్గురి ఆత్మహత్య

image

MBNR, WNP, NGKL జిల్లాల్లో శుక్రవారం వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల వివరాలిలా.. జడ్చర్లకు చెందిన వడ్డె సంజీవ(30) అప్పులు తీర్చలేక ఉరేసుకున్నాడు. గోపాల్‌పేటకు చెందిన కొంకలి మల్లయ్య(40) కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. NGKL జిల్లా పెనిమిళ్లకి చెందిన మేర కృష్ణయ్య సోదరి దగ్గర ఉంటుండగా, కడుపునొప్పి భరించలేక పొలం వద్ద ఉరేసుకున్నాడు.

Similar News

News March 1, 2025

టన్నెల్ ఘటన.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు

image

TG: శ్రీశైలం SLBC టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. టీబీఎం(టన్నెల్ బోరింగ్ మెషీన్)ను కట్ చేస్తున్నారని, మనుషులు ఉన్నట్లుగా ఆనవాళ్లు ఉన్నచోట తవ్వకాలు జరుగుతున్నాయని వెల్లడించారు. నలుగురు సిబ్బంది TBM కింద ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. పనులు వేగంగా జరగడం లేదని విమర్శించే వారు లోపలికి వెళ్లి చూస్తే పరిస్థితి అర్థం అవుతుందన్నారు.

News March 1, 2025

సంపద సృష్టిపై నిత్యం ఆలోచిస్తున్నా: సీఎం

image

AP: కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 12.9% వృద్ధి రేటు సాధించామని CM చంద్రబాబు తెలిపారు. YCP హయాంలో రోడ్లన్నీ గుంతలమయమైతే తాము మరమ్మతులు చేశామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. సంపద ఎలా సృష్టించాలనే దానిపై నిత్యం ఆలోచిస్తున్నామని పునరుద్ఘాటించారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ద్వారా పేదల జీవితాల్లో మార్పులు తెస్తామని చెప్పారు.

News March 1, 2025

పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యం: కలెక్టర్

image

ఆర్థికంగా అత్యంత వెనుక బడిన కుటుంబాలను పేదరికం నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ వెంకట మురళి తెలిపారు. శనివారం కలెక్టరేట్ నుంచి వీక్షణ సమావేశం ద్వారా జిల్లా అధికారులు, ఎంపీడీవోలు, తహశీల్దార్లకు ఆయన పేదరిక నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాల మేరకు అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు.

error: Content is protected !!