News March 21, 2025

వేసవిలో అప్రమత్తంగా ఉండాలి: బాపట్ల కలెక్టర్

image

బాపట్ల జిల్లాలో రోజు రోజుకు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి గురువారం ఓ ప్రకటన ద్వారా సూచించారు. ఎండ తీవ్రత వడగాల్పులు సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. తలకి టోపీ లేదా రుమాలు కట్టుకోవాలన్నారు. కాటన్ వస్త్రాలు ధరించాలని సూచించారు.

Similar News

News October 22, 2025

వనపర్తి: కేతపల్లిలో అత్యధిక వర్షపాతం

image

వనపర్తి జిల్లాలో గడిచిన 24 గంటల్లో 21 వర్షపాతం నమోదు కేంద్రాలలో వర్షం నమోదైంది. అత్యధికంగా కేతపల్లిలో 23.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీరంగాపూర్ 20.8 మి.మీ, పెబ్బేరు 20.0 మి.మీ, పానగల్ 17.0 మి.మీ వర్షపాతం నమోదు కాగా, ఇతర మండలాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది.

News October 22, 2025

చర్లపల్లి – దానాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లు

image

పండుగల రద్దీ దృష్ట్యా చర్లపల్లి, దానాపూర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. అక్టోబరు 23, 28 తేదీల్లో చర్లపల్లి నుంచి దానాపూర్ (07049), 24, 29 తేదీల్లో దానాపూర్ నుంచి చర్లపల్లి (07092) రైళ్లు నడుస్తాయి. అలాగే, 26న 07049, 27న 07050 నంబరు గల ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు.

News October 22, 2025

SRCL: NOV 3న అరుణాచలానికి స్పెషల్ బస్సు

image

రాజన్న సిరిసిల్ల డిపోవారు నవంబర్ 3న అరుణాచలానికి ప్రత్యేక బస్ సర్వీసును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ వెల్లడించారు. తమిళనాడులోని అత్యంత పవిత్రమైన అరుణాచల శివ గిరి ప్రదక్షిణకు ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించారు. పెద్దలకు రూ.4,100/-, పిల్లలకు రూ.3,100/-లను టికెట్ ధరగా నిర్ణయించారు. ఈ బస్సు అరుణాచలం- అమ్మవారి శక్తిపీఠం గద్వాల జోగులాంబ మీదుగా వెళ్తుంది. వివరాలకు 9063152130 నంబర్‌ను సంప్రదించవచ్చు.