News March 28, 2025
వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి: కలెక్టర్

పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సంబంధిత ఆర్డీవోలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కలెక్టర్ టీఎస్ చేతన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత వేసవిలో ఆయా డివిజన్లో ఎక్కడా కూడా నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే నీటి సమస్యపై ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షించి పరిష్కరించాలన్నారు.
Similar News
News November 5, 2025
పార్టీనే నాకు దైవం: కేశినేని చిన్ని

AP: తాను చంద్రబాబుకు వీర భక్తుడినని MP కేశినేని చిన్ని పేర్కొన్నారు. 20 నిమిషాల పాటు క్రమశిక్షణ కమిటీకి వివరణిచ్చి ఆయన వెళ్లిపోయారు. ‘పార్టీయే నాకు దైవం, చంద్రబాబు మాకు సుప్రీం. నాకు తిరువూరులో జరిగిన అవమానం కంటే MLA వల్ల పార్టీకి ఎక్కువ నష్టం జరిగింది. నియోజకవర్గ కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ నిర్ణయం ఉంటుందని అనుకుంటున్నా’ అని వ్యాఖ్యానించారు. ఈ తిరువూరు ఎపిసోడ్పై లోకేశ్ నివేదిక కోరారు.
News November 5, 2025
కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్.. 43 మందికి శిక్షలు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించి 43 మందికి కోర్టు శిక్షలు విధించింది. మద్యం తాగి వాహనం నడిపిన ఆరుగురు వ్యక్తులకు న్యాయస్థానం 1 రోజు జైలు శిక్షతోపాటు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధించింది. వీరిలో కామారెడ్డిలో ఇద్దరు, మాచారెడ్డి, దోమకొండ, తాడ్వాయి ప్రాంతాల్లో ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. మిగిలిన 37 మంది వాహనదారులకు రూ.37 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
News November 5, 2025
నిజామాబాద్: ఇద్దరికి జైలు శిక్ష

నవీపేట్ మండలం లింగాపూర్ గ్రామంలో 2020 సంవత్సరంలో పొలం వివాదంలో గొడవ కారణంగా కేశపురం మహేశ్ పై గడ్డపారతో దాడి చేయగా గగ్గోని నవీన్, గగ్గోని హనుమాన్లుపై కేసు నమోదైంది. కేసు విచారణలో భాగంగా ఈరోజు నిజామాబాద్ స్టేషన్ కోడ్ జడ్జి సాయిసుధా ఇద్దరు నిందితులను దోషులుగా తేల్చి గగ్గోని నవీన్కు ఐదేళ్లు, హనుమాన్లుకు మూడేళ్ల జైలు శిక్ష విధించారని నవీపేట్ ఎస్ఐ తిరుపతి తెలిపారు.


