News May 14, 2024
వేసవీ రద్దీ దృష్ట్యా విశాఖ – సికింద్రాబాద్ – విశాఖ ప్రత్యేక రైలు
ఏపీలో ఓటేసేందుకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వచ్చి తిరిగి వెళ్లే వారి సౌకర్యార్ధం రైల్వే శాఖ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. విశాఖ-సికింద్రాబాద్-విశాఖ(08589/08590) మధ్య ఈ నెల 14, 15 తేదీలలో నడుస్తుందని తెలిపారు. 14వ తేదీ సాయంత్రం 4.15గంటలకు విశాఖలో బయలుదేరి 15వ తేదీ ఉదయం 6.15కి సికింద్రాబాద్ చేరుతుంది. మరల 15వ తేదీ ఉదయం 10.30గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరి అదే రోజు రాత్రి 11.30కు విశాఖ చేరుతుంది.
Similar News
News September 30, 2024
విజయనగరం ఉత్సవాల్లో 12 చోట్ల వినోద కార్యక్రమాలు
అక్టోబర్ 13, 14 తేదీలలో నిర్వహించనున్న విజయనగరం ఉత్సవాల్లో 12 ప్రధాన వేదికల వద్ద వినోద కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ తెలిపారు. వేదికల వద్ద జిల్లా అధికారులను ఇన్ ఛార్జ్లుగా నియమించినట్లు వెల్లడించారు. కార్యక్రమాల పట్ల వారి ఆసక్తి తగ్గట్టుగా సుమారు 50 మంది లైఫ్ మెంబర్లను ప్రతి వేదిక వద్ద సర్దుబాటు చేసినట్లు పేర్కొన్నారు.
News September 30, 2024
లేజర్ షో ద్వారా విజయనగరం చరిత్ర
కోట గోడపై అన్నివైపులా లైటింగ్ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. కోట చుట్టూ వున్న కందకాలను స్వచ్ఛమైన నీటితో నింపి లాన్తో అందంగా తీర్చిదిద్దాలన్నారు. కోట గోడను ఆనుకొని వెనకవైపు ఉన్న ఖాళీ స్థలంలో సందర్శకులు కూర్చొనేందుకు వీలుగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కోటకు దక్షిణం వైపు ప్రతిరోజూ లైట్ అండ్ షో నిర్వహించి విజయనగరం చరిత్ర, వైభవాన్ని లేజర్ షో ప్రదర్శిస్తారు.
News September 30, 2024
బొబ్బిలిలో సినీ నటుడు సాయికుమార్
బొబ్బిలిలోని స్థానిక హోటల్ లో పోలీసుల ఆధ్వర్యంలో సోమవారం మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సినీ హీరో సాయికుమార్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా యువత మాదకద్రవ్యాలకు అలవాటుపడితే తమ బంగారు భవిష్యత్ శూన్యమవుతుందని సూచించారు.