News November 6, 2024
వైఎస్ జగన్తో భేటీ కానున్న విజయనగరం నేతలు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ నేతలు బుధవారం భేటీ కానున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో.. అభ్యర్థి ఎంపికపై ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. దీంతో వైసీపీ నేతలు, పలువురు ఆశావాహులు తాడేపల్లికి పయనమయ్యారు. వైసీపీ తరుఫున ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవరో మరికొన్ని గంటల్లోనే తేలిపోనుంది.
Similar News
News December 10, 2025
VZM: కానిస్టేబుల్గా ఎంపికైన వారికి గమనిక

ఇటీవల జరిగిన పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో ఎంపికైన అభ్యర్థులు ఈనెల 15న జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరుకావాలని SP ఏ.ఆర్.దామోదర్ బుధవారం తెలిపారు. ఈనెల 16న మంగళగిరి బెటాలియన్లోని పెరేడ్ మైదానంలో CM చంద్రబాబుతో ముఖాముఖి అనంతరం అక్కడే వీరికి నియామక పత్రాలు అందజేస్తామన్నారు. ఈనెల 22 నుంచి శిక్షణ ప్రారంభం కానుందని, PTC, DTCలో అభ్యర్థులు ఈనెల 21న రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు.
News December 10, 2025
VZM: పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు

ఈనెల 13న జరగనున్న జాతీయ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు రాజీ ద్వారా పరిష్కరించేలా ముందస్తు చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ అధికారులకు బుధవారం ఆదేశాలు ఇచ్చారు. పోలీసు స్టేషన్ స్థాయిలోనే రాజీ అయ్యే అవకాశం ఉన్న కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, ట్రాఫిక్ కేసులు, చిన్న క్రిమినల్ కేసులు, ఎక్సైజ్ కేసులు, పెండింగ్ చలాన్లను ముందుగా గుర్తించాలని సూచించారు.
News December 10, 2025
విజయనగరం: మా జీతాలు ఇవ్వండి సార్..!

విజయనగరం జిల్లాలో ఆర్ అండ్ బీ, జలవనరులు, పంచాయతీరాజ్, పబ్లిక్ హెల్త్ సహా ఇతర ఇంజినీరింగ్ విభాగాల్లో ఉద్యోగస్థులకు 10వ తేదీ వచ్చినా కూడా ప్రభుత్వం జీతాలు వేయలేదని బుధవారం ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎల్వీ యుగంధర్ని ఏపీసిపిఎస్ఈఏ సభ్యులు కలిసి సమస్యను విన్నవించుకున్నారు. ఈ విషయంపై ఎస్టీఓ అమరావతి అధికారులకు తెలియజేస్తామని హామీ ఇచ్చారు.


