News April 6, 2025
వైఎస్ జగన్ రాప్తాడు పర్యటన ఖరారు

మాజీ సీఎం వైఎస్ జగన్ రాప్తాడు పర్యటన ఖరారైంది. ఈ నెల 8న పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఆయన పర్యటించనున్నారు. ఇటీవల ప్రత్యర్థుల దాడిలో గాయపడి చికిత్స పొందుతూ మరణించిన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ పర్యటన వేళ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు వైసీపీ కీలక నేతలు శనివారం సమావేశం నిర్వహించి చర్చించారు.
Similar News
News April 17, 2025
శాంసన్కు గాయం.. ఇప్పుడెలా ఉందంటే?

DCతో మ్యాచులో RR కెప్టెన్ సంజూ శాంసన్ బ్యాటింగ్ చేస్తూ అసౌకర్యానికి గురయ్యారు. పక్కటెముకల్లో నొప్పి రావడంతో రిటైర్డ్ హర్ట్గా మైదానాన్ని వీడారు. అయితే మ్యాచ్ అనంతరం తాను ప్రస్తుతానికి బాగానే ఉన్నట్లు సంజూ స్పష్టం చేశారు. ఇవాళ స్కానింగ్ జరిగాక గాయం తీవ్రతపై స్పష్టత వచ్చే అవకాశముంది. RR తన తర్వాతి మ్యాచును ఈనెల 19న LSGతో ఆడనుంది. ఆలోగా సంజూ కోలుకునే అవకాశముందని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.
News April 17, 2025
ఉమ్మడి ప.గో.జిల్లాకు 100 ఏళ్లు పూర్తి

ఏలూరు కేంద్రంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా 1925 ఏప్రిల్ 15న అవతరించింది. దీంతో ఏలూరు కేంద్రం వందేళ్లు పూర్తి చేసుకుందని అధికారులు తెలిపారు. 1931 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 13 లక్షల మంది జనాభా ఉండగా.. 37.99 లక్షలకు చేరింది. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉమ్మడి ప.గో జిల్లాలో భక్తి పారవశమైన ఆలయాలు, విదేశీయులను ఆకర్షించే కొల్లేరు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.
News April 17, 2025
స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు పూర్తి చేయండి: మేయర్

వేగవంతంగా స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో ఇండోర్ స్టేడియం ప్రాంతంలో సుమారు రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణ పనులను మేయర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు కొనసాగుతున్న తీరు పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం సరికాదన్నారు.